PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN Scheme: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పొడిగింపుకు రూ.3,15,614 కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించింది. దీంతో 2026-27 నుంచి 2030-31 వరకు అర్హులైన రైతులకు ఇప్పటివరకు అందుతున్న ఆర్థిక సాయం యథావిధిగా కొనసాగనుంది.
2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన పీఎం-కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు సమాన విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా జమ చేస్తారు.
Also Read
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అత్యవసరంగా నిధులు అవసరమయ్యే సమయంలోనే ఈ విడతలను విడుదల చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. దీంతో రైతులు అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, పీఎం-కిసాన్ పథకం కోసం రూ.3.15 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులకు నిరంతర ఆర్థిక భరోసా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులే ఈ పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. నీతి ఆయోగ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, పీఎం-కిసాన్ పథకం రైతుల ఆదాయాన్ని పెంచడంలో, అనధికార రుణాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎం-కిసాన్ 23వ విడత నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సహకారంతో నిర్వహించింది. అదే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ‘సముద్ర మంథన్’ జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకానికి కూడా రూ.84,084 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. ఈ పథకం కూడా 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది.
మొత్తంగా పీఎం-కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించడం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కొనసాగడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.
తాజావార్తలు
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?