Tata Sierra Test Drive Crash: ఇటీవల మార్కెట్లోకి వచ్చిన Tata Sierra SUV టెస్ట్ డ్రైవ్ సమయంలో ప్రమాదానికి గురైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. థానే నగరంలోని నౌపాడ ప్రాంతంలో ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. టెస్ట్ డ్రైవ్ సమయంలో ప్రమాదం కారు కొనుగోలు చేసే ముందు సాధారణంగా వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ చేస్తారు. అలాంటి టెస్ట్ డ్రైవ్ సమయంలోనే ఈ […]
Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీబిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరాతీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన […]
Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల పై ఎఫెక్ట్ పడింది. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. కొన్ని సంస్థలు […]
AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.ఇప్పటివరకు Andhra Pradesh Anti-Corruption Bureau నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో […]
Off The Record: రైతుల అవసరాలు తీర్చడంతో పాటు వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో ఆ ఒక్క పని తప్ప మిగతా అన్నీ జరిగిపోతున్నాయట. రకరకాల రుణాల పేరుతో భారీ ఎత్తున మోసాలు జరుగుతూ.. అవినీతి, ఆర్థిక అరాచకాలకు కేరాఫ్గా మారిందని అంటున్నారు. నకిలీ రైతులు, డ్వాక్రా సంఘాల పేరుతో అడ్డసుడి రుణాలు, కోల్డ్ స్టోరేజీలలో పంట నిల్వల పేరుతో గోల్మాల్ లోన్లు… ఇలా ఒకటేంటి… అవినీతికి అవకాశం […]
Off The Record : ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార భాగస్వామి జనసేన కీలక నాయకుడు నాగబాబు భవిష్యత్ ఏంటన్నదే ఆ డిస్కషన్. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ అయినా… అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదట. ఎమ్మెల్సీగా నామినేట్ అయి దాదాపు ఏడాదవుతోంది. అయితే… మండలి పోస్ట్ ఇచ్చినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశముందన్న ప్రచారం జోరుగా జరిగింది. అప్పట్లో రకరకాల లెక్కలు, ఎక్కాలు చెప్పేసి […]
Story Board: టీట్వంటీ వరల్డ్ కప్ సొంత గడ్డపైనే జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కొదువలేదు. అలవాటైన పిచ్లపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శనే చేస్తారనే ఆశలున్నాయి. కానీ ఈ టీమ్ కప్ గెలుస్తుందనే నమ్మకమైతే మొదట్లో కనిపించలేదు. దీనికి తోడు టీమిండియా ఆటతీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్లోనే అమెరికా చేతిలో పరాభవం తప్పిన మెన్స్ టీం.. కష్టపడుతూనే సూపర్ 8కు చేరింది. అక్కడ్నుంచైనా అసలు ఆటతీరు బయటికొస్తుందనుకుంటే.. సౌతాఫ్రికా చేతిలో […]
AP Housing Scheme: ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్దిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు అందించేలా అధికారిక లేఖ వెళ్లేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సీఎం సూచించారు. ఇటీవల ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ ఇండియా […]
Off The Record: ఒకప్పటి కంచుకోట నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది టీడీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అభ్యర్థి ఎవరన్న దాంతో సంబంధం లేకుండా పార్టీ గుర్తుకు ఓటేసే నియోజకవర్గం ఇది అని టీడీపీ పెద్దలు సైతం అంగీకరిస్తారు. కానీ… గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇది జనసేన కోటాలోకి వెళ్ళడంతో….కూటమి వేవ్లో లోకం మాధవికి ఛాన్స్ దక్కింది. ఎన్నికల సమయంలో స్థానిక టీడీపీ […]
CM Chandrababu Reviews Iran War Impact: ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై […]