Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Single-Teacher Schools: ఆంధ్రప్రదేశ్లో సింగిల్ టీచర్లు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. తక్కువ మంది ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తుండటంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని, దీనివల్ల వారి విద్యా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్లో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కనీసం ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా సింగిల్ టీచర్ లేదా తక్కువ మంది ఉపాధ్యాయులతో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు 16 వేలకుపైగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ అంశాన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్రంలోని సింగిల్ టీచర్ పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల ఖాళీలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాగా, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతున్నా.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న విషయం విదితమే.. ఈ పరిణామాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది..
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?