CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరగా పరిష్కరించేలా పనిచేయాలని తెలిపారు. యుద్ధ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి ప్రపంచంలోని కొన్ని […]
Robotic Cockroach Spy: బొద్దింకలను స్పైగా ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేశారు.. డ్రోన్ల తర్వాత ఇప్పుడు గూఢచర్యంలో కొత్త టెక్నాలజీగా రోబోటిక్ బొద్దింకలు రంగంలోకి రాబోతున్నాయి. జర్మనీలోని SWARM Biotactics అనే స్టార్టప్ సంస్థ ప్రత్యేకమైన సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి చేస్తోంది. ఇవి నిఘా, సైనిక కార్యకలాపాలు, అలాగే రక్షణ చర్యల్లో ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. టెక్నాలజీ ప్రపంచంలో తరచూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఆలోచనలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా […]
Hyderabad Gas Shortage: ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. దీంతో క్రూడాయిల్ ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావం పడింది.. పెట్రో, గ్యాస్ కు కొరత ఏర్పడుతుంది.. అయితే, ముఖ్యంగా భారత్లో కమర్షియల్ గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది.. వంట గ్యాస్ పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. హోటళ్లకు మాత్రం సరఫరా తగ్గించింది.. అయితే, హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని […]
TTD Laddu Controversy: సంచలనం సృష్టించిన టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. టీటీడీ లడ్డూ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు కలిసినట్టు ఆరోపణలు చేయడం పై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా? అని పిటిషనర్ను […]
LPG Booking Messages Without Booking: ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది.. ముఖ్యంగా విజయవాడలోని గ్యాస్ ఏజెన్సీపై గోల్మాల్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్లు బుక్ చేయకుండానే గ్యాస్ సిలిండర్ బుక్ అయినట్లు మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సాయిరామ్ థియేటర్ సమీపంలో ఉన్న భారత్ గ్యాస్ కు చెందిన తరుణీ శ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. […]
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఈ తాజా అప్డేట్తో యాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో భాగంగా మెసేజింగ్ యాప్లో ప్రత్యేకంగా Meta AI ట్యాబ్ను ప్రవేశపెట్టారు. దీంతో వినియోగదారులు AI ఫీచర్లను నేరుగా యాప్లోనే సులభంగా ఉపయోగించుకోవచ్చు. కొత్త AI ట్యాబ్ ఏమిటి? ఈ […]
Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్.. ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లిసా గిల్ నియామకం న్యాయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఇక ఆయన పదవీ విరమణ అనంతరం జస్టిస్ […]
Iran War Impact on Pakistan: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ప్రారంభమై.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింఇ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో పరిస్థితి మరింత సంక్షోభంగా మారింది. ఇరాన్కు సంబంధించిన యుద్ధ పరిణామాలు అక్కడి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్, ఇప్పుడు ఇంధన ధరల పెరుగుదలతో మరింత కష్టాల్లో పడింది. దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. […]
Fog: వేసవి కాలం మధ్యలోనూ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా రాజమండ్రిలో ఉదయం వేళ గోదావరి నదిపై విస్తరించిన దట్టమైన పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. గోదావరి నదిపై ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి, హేవలక్ బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి పొగమంచుతో పూర్తిగా కప్పుకుపోయాయి. దీంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా […]
Off The Record: వాసుపల్లి గణేష్ కుమార్….విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి…..టీడీపీలో రెండు సార్లు గెలిచి…వైసీపీ అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించిన నేత. 2014, 2019 ఎన్నికల్లో తాను ఓడించిన ఫ్యాన్ పార్టీ కేడర్కే ఇప్పుడు నాయకత్వం వహిస్తూ కూటమితో ఢీ అంటే ఢీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా జగన్ హవా ఉన్నా…. వాసుపల్లి మాత్రం సౌత్ అడ్డాలో సత్తా చాటగలిగారు. ఆయనకున్న మాస్ ఇమేజ్ అప్పుడు బాగా […]