Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Loan Demand: దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో గోల్డ్ లోన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు బంగారాన్ని ప్రధానంగా ఆభరణాలు, పెట్టుబడుల కోసం మాత్రమే ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ప్రజల్లో వేగంగా పెరుగుతున్న ధోరణిగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ అంశంపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, గోల్డ్ లోన్ మార్కెట్ మాత్రం రికార్డు స్థాయిలో విస్తరిస్తోంది.
ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం, 2026 మే నాటికి బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు గత ఏడాదితో పోలిస్తే 105 శాతం పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకులు మంజూరు చేసిన బకాయి గోల్డ్ లోన్ల మొత్తం సుమారు రూ.5.1 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకింగ్ రంగం ప్రకారం, ఈ పెరుగుదలకు ప్రధాన కారణం బంగారం ధరలు గణనీయంగా పెరగడమే.
Also Read
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య బంగారం ధరలు భారీగా పెరగడంతో, అదే పరిమాణంలో ఉన్న బంగారంపై గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకాశం వినియోగదారులకు లభించింది. దీంతో వ్యక్తిగత అవసరాలతో పాటు వ్యాపార అవసరాల కోసం కూడా ప్రజలు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే ధోరణి పెరిగింది. బ్యాంకులకు కూడా ఇది లాభదాయకంగా మారిందని, గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో వేగంగా విస్తరిస్తోందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు గోల్డ్ లోన్లు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఆకస్మిక ఆర్థిక అవసరాల సమయంలో గోల్డ్ లోన్లను వేగవంతమైన, సులభమైన ఆర్థిక వనరుగా ఉపయోగిస్తున్నాయి. దీంతో అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ రుణదాతలు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు. గోల్డ్ లోన్ల సంఖ్య మాత్రమే కాకుండా, ఒక్కో రుణం సగటు పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, 2025-26లో సగటు గోల్డ్ లోన్ మొత్తం రూ.1.96 లక్షలకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 39 శాతం అధికం. మూడు సంవత్సరాల క్రితం, అంటే 2022-23లో సగటు గోల్డ్ లోన్ కేవలం రూ.98 వేలుగా ఉండగా, ఇప్పుడు అది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
మార్చి 2024 నుంచి మార్చి 2026 వరకు బంగారం ధరల సూచీ సుమారు 144 శాతం పెరిగింది. అయితే అదే కాలంలో గోల్డ్ లోన్ల విలువ 200 శాతానికి పైగా పెరగడం విశేషం. ఇది కేవలం బంగారం ధరలు పెరగడమే కాకుండా, గోల్డ్ లోన్లపై ప్రజల ఆసక్తి కూడా భారీగా పెరిగిందని సూచిస్తోంది. ప్రస్తుతం చిన్న, మధ్య తరహా వ్యాపారులు కూడా నిర్వహణ మూలధనం, వ్యాపార విస్తరణ కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు.
ఇక ఆర్బీఐ మాత్రం ఈ పరిణామంపై అప్రమత్తంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో గోల్డ్ లోన్ల వేగవంతమైన వృద్ధిపై జాగ్రత్తలు అవసరమని పేర్కొంది. భవిష్యత్తులో బంగారం ధరలు దీర్ఘకాలం పాటు తగ్గితే, తాకట్టు పెట్టిన బంగారం విలువ కూడా పడిపోతుందని, దాంతో బ్యాంకులకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. రుణాల ఎగవేత అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉన్నందున గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోల నాణ్యతను, రిస్క్ మేనేజ్మెంట్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. మొత్తంగా, బంగారం ఇప్పుడు కేవలం పెట్టుబడి లేదా ఆభరణం మాత్రమే కాదు.. అత్యవసర ఆర్థిక అవసరాలకు అత్యంత వేగవంతమైన, సులభమైన రుణ వనరుగా మారుతోంది. అయితే బంగారం ధరల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు, రుణగ్రహీతలు ఇద్దరూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!