Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్లైన్స్ షెడ్యూల్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhogapuram International Airport: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అనగా ఆగస్టు 1వ తేదీన ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ASR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న VTZ కోడ్తోనే కొత్త విమానాశ్రయం సేవలు కొనసాగనున్నాయి.
ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్ను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్కు రోజూ ఐదు, బెంగళూరుకు రెండు, విజయవాడకు నాలుగు విమాన సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన వైమానిక అనుసంధానం అందుబాటులోకి రానుంది.
Also Read
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
అంతర్జాతీయ సేవల విషయంలో కూడా భోగాపురం విమానాశ్రయానికి మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ప్రస్తుతం విశాఖ–సింగపూర్ మధ్య వారానికి మూడు రోజులుగా నడుస్తున్న స్కూట్ ఎయిర్ సర్వీసులు ఆగస్టు 17 నుంచి వారానికి నాలుగు రోజులకు పెరగనున్నాయి. అలాగే అబుదాబీకి విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఈ మార్గంలో కూడా వారానికి నాలుగు రోజుల పాటు విమానాలు నడిపేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో పర్యాటకం, వాణిజ్యం, ఐటీ, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే 30 సంవత్సరాల పాటు షెడ్యూల్ విమానాల కార్యకలాపాలు ఈ విమానాశ్రయం నుంచే కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!