Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేశామని, భవిష్యత్ ఎన్నికల్లో ఇది పార్టీకి మరింత బలంగా ఉపయోగపడుతుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, జగన్ సందేశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైసీపీకి అధికారమే లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన అజెండా అని సజ్జల స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే నాయకుడు కాదని, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకుడేనని జగన్ను అభివర్ణించారు.
చంద్రబాబు నాయుడు రాజకీయాలు అధికారం కోసం ఉంటే, వైసీపీ రాజకీయాలు ప్రజల కోసం ఉంటాయని సజ్జల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కొన్ని వర్గాలు మీడియాను ఉపయోగించి ప్రజల్లో భ్రమలు సృష్టించాయని, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజలతో నేరుగా మమేకమయ్యే అత్యంత ప్రభావవంతమైన వేదికగా మారిందని చెప్పారు. అయితే, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మరింత భారీ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టాల వల్లే వైసీపీ ఈ స్థాయిలో నిలబడగలిగిందని కొనియాడారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా జగన్ ముందుండి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్లైన్ పెట్టి మరి..!
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించిన సజ్జల, ఒక్క పంచాయతీని కూడా పోటీ లేకుండా వదిలే పరిస్థితి ఉండదని జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందనే విషయాన్ని నిరూపిస్తోందని పేర్కొన్నారు. పేదలకు ఉపయోగపడని రాజకీయాలకు జగన్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరని సజ్జల అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కేవలం పైపై కనిపించే అభివృద్ధి (కాస్మెటిక్ డెవలప్మెంట్) వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేసిన సజ్జల, వైఎస్ జగన్ చెప్పే అంశాలను చిన్న చిన్న వీడియోలు, క్యాప్సూల్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేర్చే ప్రచారకుడిగా పనిచేయాలని కోరారు. అసభ్య పోస్టులు, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Team India: ఋతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం… రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!