Wonder Akarshana: స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే లోకాన్నే మర్చిపోయే నేటి తరం పిల్లలకు భిన్నంగా, పుస్తకాలను కాపాడుకుంటూ వందలాది మందికి జ్ఞానాన్ని పంచుతోంది ఆకర్షణ. గల్లీలో మొదలైన ఆమె చిన్న ఆలోచన, నేడు ఢిల్లీ పీఠాన్ని కదిలించే స్థాయికి ఎదిగింది. కేవలం ఐదేళ్ల కాలంలో 24 లైబ్రరీలను ఏర్పాటు చేసి, వేలాది పుస్తకాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఈ చిన్నారి ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఆకర్షణ ఆలోచన వెనుక ఒక హృదయ విదారకమైన సంఘటన ఉంది. […]
దానం నాగేందర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఆయనకు క్లారిటీ లేదా…? లేక కావాలనే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా…? ఆయన అనర్హత పిటిషన్ విచారణలో కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటి? ఆ విషయమై బీఆర్ఎస్కు, బీజేపీకి ఉన్న తేడా ఏంటి? బీజేపీ ఉచ్చు ఎమ్మెల్యే మెడకు బిగుసుకుంటుందా? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మలుపులు తిరుగుతోంది. దీనికి సంబంధించి BRS వేసిన పిటిషన్ విచారణ ముగిసింది. అయితే… బీజేపీ పిటిషన్ విషయంలో కొన్ని […]
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను పూర్తి చేశారు. సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విచారణ అనంతరం స్పీకర్ వెలువరించిన ప్రాథమిక నిర్ణయాలు రాజకీయ […]
ఆ పొలిటికల్ ఫ్యామిలీ కమలం నుంచి గులాబీ వైపు చూస్తోందా? బీఆర్ఎస్ పెద్దలు కూడా వాళ్ళు వస్తే బాగుండునని అనుకుంటున్నారా? ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న ఆ కుటుంబంలోని యువ నాయకుడు ప్రస్తుతం నియోజకవర్గంలో సఫకేషన్ ఫీలవుతున్నారా? ఇంతకీ ఏదా ఫ్యామిలీ? ఏంటా పొలిటికల్ ఇబ్బంది? 2024 లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానానికి పరిమితం అయ్యారు భరత్ ప్రసాద్. ఇక ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గానికి ముఖం […]
తెలంగాణలో మరో రాజకీయ వివాదం పురుడు పోసుకోబోతోందా? S I Rతో ఓట్ల వడపోత వివాదాలకు దారితీసే అవకాశం ఉందా? ఈ విషయంలో బీజేపీ స్పెషల్ స్కెచ్తో సిద్ధమవుతోందా? ప్రత్యేకించి హైదరాబాద్ ఓల్డ్సిటీ మీద కాషాయ దళం ఫోకస్ పెట్టాలనుకుంటోందా? అందుకోసం ఆ పార్టీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటోంది? తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి ఓటర్ లిస్ట్ సవరణకు సంబంధించిన ప్రోగ్రామ్…స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ S I R మొదలవబోతోంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ […]
ప్రపంచ గమనంలో భారతీయుల పాత్ర, నాలెడ్జ్ ఎకానమీలో దేశం సాధించబోతున్న ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఐటీ రంగం నుండి గ్రీన్ ఎనర్జీ వరకు, జనాభా విధానం నుండి ఏఐ (AI) వరకు భవిష్యత్ భారత్ ఎలా ఉండబోతోందో తన విజన్ను పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డిప్లొమాట్లు భారతీయులేనని చంద్రబాబు కొనియాడారు. ఎక్కడికి వెళ్లినా స్థానిక సంస్కృతులతో కలిసిపోవడంలో భారతీయులకు […]
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్-1, TSC, DK SZC, 2nd CRC వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ పునరావాస విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా […]
Plastic Rice Tips : ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, మనం నిత్యం తినే బియ్యం కూడా కల్తీకి గురవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్లాస్టిక్ బియ్యం లేదా తక్కువ నాణ్యత గల బియ్యం మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ నేపథ్యంలో డాక్టర్ వినోద్ శర్మ బియ్యంలో కల్తీని గుర్తించడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు. నీటి పరీక్ష (Water Test) బియ్యంలో కల్తీని గుర్తించడానికి ఇది […]
Emirates Flights Resume : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai International Airport) కు సంబంధించిన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తాజాగా వాటిని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించింది. భద్రతా కారణాల వల్ల కొంతసేపు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపిన సంస్థ, పరిస్థితులు సమీక్షించిన తరువాత తిరిగి ఆపరేషన్లు ప్రారంభించినట్లు వెల్లడించింది. శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఎమిరేట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మధ్యాహ్నం తర్వాత షెడ్యూల్ ఉన్న […]
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం తనదైన ముద్ర వేస్తూ, అంతర్జాతీయ సమస్యలపై స్పష్టమైన వైఖరిని చాటుతోంది. ముఖ్యంగా సముద్ర భద్రత విషయంలో భారత్ పాత్ర కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా, ప్రపంచ వాణిజ్య మార్గాలను కాపాడే శక్తిగా ఎదిగిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. రైసినా డైలాగ్ 2026లో ఆయన మాట్లాడుతూ, హిందూ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రం వరకు నెలకొన్న ఉద్రిక్తతలు , సముద్ర ప్రయాణాల్లో ఎదురవుతున్న సవాళ్లపై లోతైన విశ్లేషణ చేశారు. […]