Nampally Fire Accident : అగ్నికీలల్లో ఆరుగురు.. కొనసాగుతున్న రెస్క్యూ.. ఇవాళ ఎగ్జిబిషన్కు రావొద్దన్న పోలీసులు
- నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
- మంటల్లో చిక్కుకున్న ఆరుగురు
- దట్టమైన పొగతో రెస్క్యూ కష్టాలు
- నాలుగు గంటలుగా ఆపరేషన్ కొనసాగింపు
- నాంపల్లి – అబిడ్స్ – MJ మార్కెట్లో భారీగా ట్రాఫిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని నాంపల్లిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. నాంపల్లిలోని ‘బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్’ గోదాంలో మంటలు చెలరేగి దాదాపు నాలుగు గంటలు గడుస్తున్నా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్నీచర్ గోదాంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో, అదే భవనంలో నివసిస్తున్న మూడు కుటుంబాలు అగ్నికీలల మధ్య చిక్కుకుపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం ఆరుగురు లోపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో వాచ్మెన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అఖిల్ (7), ప్రణీత్ (11) తో పాటు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పెద్దవారు ఉన్నారు. దట్టమైన పొగలు , మంటల కారణంగా లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సుమారు నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా సాగుతోంది.
CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ప్రధాన రహదారిపై అగ్నిప్రమాదం జరగడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, MJ మార్కెట్, , ఏక్ మినార్ మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఫైర్ ఇంజన్లు , అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లడానికి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు ఈ మార్గాల్లో రావొద్దని కోరుతున్నారు.
ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ (నుమాయిష్) జరుగుతుండటంతో జనసంచారం విపరీతంగా ఉంటుంది. అగ్నిప్రమాదం , ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా, ఈరోజు ఎగ్జిబిషన్కు ఎవరూ రావొద్దని పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్కు రావాలని ప్లాన్ చేసుకున్న వారు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని, లేదంటే ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూనే, లోపల ఉన్న వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి.
RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!