HYDRAA : హైడ్రా నెక్స్ట్ టార్గెట్.. 450 ఏళ్ల కటోరా హౌజ్ పునరుద్ధరణ.!
- కటోరా హౌజ్ పునరుద్ధరణకు హైడ్రా ముందుకు
- గోల్కొండలో 450 ఏళ్ల జలవనరుకు నూతన జీవం
- పర్యాటక, పర్యావరణ పరిరక్షణకు కలిసి చర్యలు
- చారిత్రక జలవనరుల సంరక్షణపై ప్రభుత్వ దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, కనుమరుగవుతున్న జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా (HYDRAA) తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా గోల్కొండ కోట ప్రాంగణంలో ఉన్న 450 ఏళ్ల నాటి చారిత్రక జలవనరు ‘కటోరా హౌజ్’ పునరుద్ధరణకు హైడ్రా తన పూర్తి సహకారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ఈ కటోరా హౌజ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జలవనరు ప్రస్తుతం చెత్తాచెదారంతో, మురుగునీటితో నిండి ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని కాపాడుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కటోరా హౌజ్ పునరుద్ధరణ కోసం ముందుకు వచ్చిన ‘నిర్మాణ్’ అనే ఎన్జీవో ప్రతినిధులను రంగనాథ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ జలవనరును సంరక్షించే ప్రణాళికలో భాగంగా, మొదట ట్యాంక్లోకి ఎవరూ చెత్త వేయకుండా చుట్టూ ఎత్తైన ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నీటి నాణ్యతను కాపాడటమే కాకుండా, ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూడవచ్చు. అలాగే, సందర్శకులను ఆకట్టుకునే విధంగా జలవనరు చుట్టూ అందమైన పాత్వేను (నడక దారి) అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల గోల్కొండ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇదొక చక్కని ఆధ్యాత్మిక , చారిత్రక అనుభూతిని అందిస్తుంది.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ప్రస్తుతం కటోరా హౌజ్లో ఉన్న ప్రధాన సమస్య మురుగునీటి ప్రవాహం. ఈ చారిత్రక జలవనరు గుండా వెళ్తున్న మురుగునీటి పైప్లైన్కు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడాలని, మురుగు నీరు జలవనరులోకి చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. చారిత్రక జలవనరుల సంరక్షణ అనేది కేవలం పర్యాటక అభివృద్ధికి మాత్రమే కాకుండా, భూగర్భ జలాల పెంపునకు , నగర వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్కియాలజీ శాఖ , ఇతర స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కటోరా హౌజ్కు పూర్వ వైభవం తీసుకువచ్చే వరకు హైడ్రా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఈ సందర్భంగా స్పష్టమైంది.
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!