Charlapalli Case Solved: వీడిన చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ మిస్టరీ.. ఆ మరణశాసనం వెనుక కారణం ఇదే.!
- చర్లపల్లిలో తల్లీపిల్లల ఆత్మహత్య ఘటన సంచలనం
- సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా పోలీసుల దర్యాప్తు
- కారులో దొరికిన సూసైడ్ నోట్తో బయటపడ్డ నిజాలు
- ఒంటరితనం కారణమై ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విశ్లేషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlapalli Case Solved: బోడుప్పల్కు చెందిన సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ విజయశాంతిరెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి జనవరి 31 తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా, తాజాగా పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయనను కూడా పోలీసులు విచారించారు. కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేవని, ఆస్తి పరంగా గానీ, ఆర్థికంగా గానీ ఎటువంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయశాంతి రెడ్డికి తన తోటి ఉద్యోగులతో గానీ, ఇరుగుపొరుగు వారితో గానీ ఎటువంటి విభేదాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
రైల్వే స్టేషన్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్లో ఆ ముగ్గురూ చాలా ప్రశాంతంగా ప్లాట్ఫారమ్లపై తిరుగుతున్నట్లు కనిపించారు. ఎక్కడా వారు భయం గానీ, ఆందోళన గానీ ఉన్నట్లు కనిపించలేదు. ఆత్మహత్యకు ముందు విజయశాంతి తన కారులో ఒక లేఖను (సూసైడ్ నోట్) ఉంచారు. అందులో “మా చావుకు ఎవరూ కారణం కాదు” అని మాత్రమే రాసి ఉంది, కానీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ లేఖ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది.
పోలీసుల విశ్లేషణ ప్రకారం.. విజయశాంతి తీవ్రమైన ఒంటరితనంతో (Loneliness) కుంగిపోయినట్లు తెలుస్తోంది. భర్త విదేశాల్లో ఉండటం, పిల్లలు చదువుల్లో బిజీగా ఉండటం, తానూ ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూ మానసిక వేదనకు గురైనట్లు అనుమానిస్తున్నారు. పిల్లలు కూడా తల్లి మాటే శిరోధార్యంగా భావించి, ఆమె చెప్పినదానికి సమ్మతించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి పిల్లలకు చేసిన బోధనలు వారిపై తీవ్ర ప్రభావం చూపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!