AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
- ఇంటి నుంచే 10 నిమిషాల్లో పోలీస్ ఫిర్యాదు నమోదు
- వయస్సుకు తగ్గట్టు మాట్లాడే స్మార్ట్ ఏఐ టెక్నాలజీ
- పోలీస్ స్టేషన్ భయం లేకుండా డిజిటల్ కంప్లైంట్ సౌకర్యం
- త్వరలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలు , వృద్ధుల కోసం ఒక విప్లవాత్మకమైన ఏఐ (AI) సిస్టమ్ను అభివృద్ధి చేశారు. సాధారణంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది భయపడతారు లేదా మొహమాటపడతారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఫిర్యాదు నమోదు చేసే సాంకేతికతను వీరు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యార్థులు తయారు చేసిన సిస్టమ్ ఒక మనిషిలాగా ఎదుటివారితో మాట్లాడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మాట్లాడే వ్యక్తి వయస్సును బట్టి ఇది తన సంభాషణను మార్చుకుంటుంది. చిన్న పిల్లలు ఫిర్యాదు చేయాలనుకుంటే వారి మానసిక స్థితికి తగ్గట్టుగా సున్నితంగా మాట్లాడుతుంది. పెద్దవారు లేదా వృద్ధులతో వారి స్థాయికి తగినట్లుగా సంభాషించి వివరాలను సేకరిస్తుంది.
Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
సాధారణంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే సుమారు మూడు గంటల సమయం పడుతుంది. కానీ ఈ ఏఐ సిస్టమ్ ద్వారా కేవలం 10 నిమిషాల ఫోన్ కాల్ లేదా సంభాషణతో పూర్తి వివరాలను సేకరించి, ఆటోమేటిక్గా కంప్లైంట్ ఫైల్ చేసి సంబంధిత పోలీస్ అధికారులకు పంపిస్తుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్కు వెళ్లాలనే భయం ఉండదు , బాధితులు ఎంతో కంఫర్టబుల్గా తమ సమస్యను చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ వాట్సాప్ వాడుతున్నందున, ఈ ఏఐ సిస్టమ్ను వాట్సాప్లోకి ఇంటిగ్రేట్ చేయనున్నారు. దీనివల్ల ప్రజలు మరింత సులభంగా, ఒక మెసేజ్ లేదా వాయిస్ నోట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసే వీలుంటుంది. ఈ వినూత్న ఆవిష్కరణ భవిష్యత్తులో పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని, ముఖ్యంగా బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
-
Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
-
Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!