Gogikar Sai Krishna
Author- NTV Telugu-
IPL 2022 : ఢిల్లీపై రాజస్తాన్ ఘన విజయం..
ఈ రోజు ఐపీఎల్ సీజన్ 2022లో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఈ రోజు మంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును ఢిల్లీ జట్టు ముందుంచింది. […] -
Kishan Reddy : సాయి గణేష్ని తెచ్చి ఇవ్వలేకపోయినా అండగా ఉంటాం
ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరుపున రూ. 8లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. అంతేకాకుండా సాయి గణేష్ కుటుంబానిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి గణేష్ ని తెచ్చి ఇవ్వలేక పోయాన అండగా ఉంటామన్నారు. సాయి గణేష్ మృతి చాలా దురదృష్టకరమని, ఇది నిజాం రాజ్యం కాదు…కుటుంబ రాజకీయాలు తెలంగాణ లో తెస్తామంటే ఒప్పు కోరన్నారు. హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టారు […] -
MLC Jeevan Reddy : తోడు దొంగల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పన్నుల రూపేనా ఈ ఏడేళ్ల కాలంలో తెలంగాణలో 7 లక్షల కోట్లను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తోడు దొంగల్ల దోసుకున్నాయని ఆయన ఆరోపించారు. 2014కు ముందు ఉన్న ధరలే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ పన్నుల రూపేనా లీటరు 50 పెంచారని, వంట గ్యాస్ 500 పెంచి ప్రజల నుంచి […] -
Bandi Sanjay : సాయి గణేష్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి గణేష్ ఆత్మహత్యపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మహా సంగ్రామ యాత్రలో ఉన్న.. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకారమని ఆయన అన్నారు. టీఆర్ఎస్, మంత్రి, పోలీసులు సాయి గణేష్ను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. సాయి గణేష్ది ప్రభుత్వ హత్య అని ఆయన మండిపడ్డారు. కాషాయం జెండా రెపరెపల కోసం సాయి గణేష్ కృషి చేశాడని, ప్రజాస్వామ్య బద్దకంగా, న్యాయ పోరాటం చేశాడన్నారు. అక్రమ […] -
IPL 2022 : దంచికొట్టిన రాజస్తాన్.. ఢిల్లీ టార్గెట్ 223
ఐపీఎల్ 2022 సీజన్ జోష్ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును […] -
Puvvada Ajay Kumar : నాపై కుట్రలు చేస్తున్నారు..
తెలంగాణ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారిన సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. శుక్రవారం ఆయన వైరాలో కమ్మ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరిగింది చిన్నవిషయమే అయినా.. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నాపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర మంతి వర్గం నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే పువ్వాడ వ్యాఖ్యలు టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు […] -
Komatireddy Raj Gopal Reddy : కేసీఆర్, కేటీఆర్ల పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రిలో పర్యటించిన క్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పెట్టిన భిక్ష కేసీఆర్ కుటుంబానికి పదవులు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్, కేటీఆర్ మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష అంటూ ఆయన అగ్రహం వ్యక్తం […] -
IPL 2022 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
ఐపీఎల్ 2022 సీజన్ జోష్ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. దీంతో ఈ మ్యాచ్కు రికీ పాంటింగ్ […] -
Weather Update : తెలంగాణవాసులకు కూల్న్యూస్.. మరో 4రోజులు వర్షాలు..
వేసవికాలం తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భానుడి ప్రతాపానికి వేసవికాలం ప్రారంభం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు. ఉదయం 9 నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలపై వరుణుడు నిన్న కరుణించి వర్షం కురిపించడంతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ రోజుల కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో […] -
Bigala Ganesh : నిజామాబాద్లో సాఫ్ట్ వేర్ రంగం పుంజుకుంటుంది
నిజామాబాద్ టీ-హబ్ ను అమెరికాకు చెందిన వైటల్ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధుల, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు బిగాల మహేష్ గుప్తా, ఎమ్మెల్యే బిగాల గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా బిగాల గణేష్ మాట్లాడుతూ.. టీ-హబ్ ను అమెరికాకు చెందిన ప్రతినిధులు సందర్శించారని, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ హబ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని, హైదరాబాద్, […]
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!