Arshdeep Singh: బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh: టీమిండియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్ ను కుదేలు చేశాడు. సికందర్ రాజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా వికెట్లు పడగొట్టి భారత్కు 72 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఈ మూడు వికెట్లతో అర్ష్దీప్ రికార్డును అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా తరుఫున ఇప్పటి వరకు 35 వికెట్లను పడగొట్టాడు. దీనితో టీ20 వరల్డ్ కప్ లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 33 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. ఈ లిస్ట్ లో మూడో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 32 వికెట్లతో ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య 29, రవీంద్ర జడేజా 22 వికెట్లతో ఉన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో అర్ష్దీప్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఐదు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి జట్టుకు కీలక సహకారం అందిస్తున్నాడు. అయితే ఈ ఎడిషన్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా వరుణ్ చక్రవర్తి 6 మ్యాచ్ల్లో 11 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్లో 47 పరుగులు, జింబాబ్వేపై 35 పరుగులు ఇవ్వడంతో ఆందోళన కలిగిస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ అనంతరం అర్ష్దీప్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
జీరో డౌన్ పేమెంట్, వడ్డీ లేని ఈఎంఐలతో Reno Series & Find X9 series స్మార్ట్ ఫోన్స్.!
వెస్టిండీస్–దక్షిణాఫ్రికా మ్యాచ్ను కుటుంబంతో కలిసి హోటల్ గదిలో చూస్తున్నానని తెలిపాడు. ఆ మ్యాచ్ భారత్కు కీలకం కావడంతో, వెస్ట్ ఇండీస్ గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి ఉండేది. “వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టినప్పుడల్లా నా నాన్న కోపంగా అరవడం మొదలుపెట్టారు.. ‘ఏం చేస్తున్నారు?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నేను ఆయన్ను శాంతింపజేసి, క్రికెట్ను ఆస్వాదించమని చెప్పాను. భారత్కు నెక్స్ట్ మ్యాచ్ కోల్కతా వేదికగా వెస్టిండీస్ తో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించే అవకాశముండటంతో రెండు టీమ్స్ కు ‘డూ ఆర్ డై’ గా మారింది.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!