నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలపై ఈ పిటిషన్లు వేశారని ప్రశ్నించింది.
ఆ నాయకుడికి టికెట్ చేజారిపోయిందా?నామినేటెడ్ పదవి వద్దనుకున్నారా? చివరకు ఆయనకు దక్కింది ఏమిటి? సొంత నియోజకవర్గంలో పదవులు వదులుకుని, పక్క నియోజకవర్గంలో ఇల్లీగల్ వ్యాపారం ఎంచుకోవడానికి కారణమెంటి? అక్రమ వ్యాపారం లాభసాటిగా సాగడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూనే… గతంలో పార్టీ కోసం ఖర్చు చేసిన. డబ్బులు రాబట్టుకుంటున్నారా? టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇసుకాసురుడిగా. మారారట. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఇసుక స్టాక్ పాయింట్కు కుందుల కింగ్ మేకర్. […]
త్యాగాలు చేసిన పార్టీ.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాటాలు నడిపిన పార్టీ.. ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలను ప్రాణంగా పెట్టిన పార్టీ ..ఒక మాట చెప్తే కట్టుబడి ఉండే కార్యకర్తలు. అగ్ర నాయకుడు ఏం చెప్తే దానికే కట్టుబడి ఉంటారు.. తిరిగి ప్రశ్నించే దాఖలాలు కూడా ఉండవు.. క్రమశిక్షణకు మారుపేరైన మావోయిస్టు పార్టీలో ఇప్పుడు లుకలుకలు బయట పడుతున్నాయి.. మావోయిస్టు పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అంతేకాదు బహిరంగ పగడంలు ఇచ్చుకునే […]
ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.
Off The Record : తెలంగాణ ప్రభుత్వ పెద్దలు,కాంగ్రెస్ నేతలు.. చేసింది కూడా చెప్పుకోలేక పోతున్నారా..? మంచి చేసిన చెప్పుకోలేకపోవడంతో ప్రత్యర్థులు చేసే ప్రచారమే పైచేయిగా మారుతుందా? చెప్పేవాళ్లు లేకనా… ఏమవుతుందిలే అని వదిలేస్తున్నారా..? పదేపదే అదే లోపం కనిపిస్తోందా?. ఇంతకీ ఆ లోపమెక్కడుంది?చేసింది ఏమీ లేకపోతే చెప్పుకోకపోవడం అనేది ఉండదు.. ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి. కానీ చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతోంది ప్రస్తుత ప్రభుత్వం. చేసింది చెప్పుకునే వరకు ప్రతిపక్షం దాన్ని […]
లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు.. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్లో గోదారా, బిష్ణోయ్పై ఈ వ్యాఖ్యలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్కి అమెరికాలోని ఓ సంస్థతో సంబంధం ఉందని ఆరోపించాడు. బిష్ణోయ్ తన సోదరుడు […]
ఆ ఇద్దరూ.. బీజేపీ నేతలే… కానీ వారి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.కమలం పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా?కాంట్రాక్టు పనుల కోసం ఇద్దరు నేతల వర్గీయుల మధ్య మళ్లీ వివాదం మొదలైందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహానికి కారణం ఏమిటి ? కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గండికోట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కేంద్రమంత్రి చొరవతో సాస్కి […]
తెలంగాణ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.
ఏపీలో పొలిటికల్ మూడ్ ఒకలా ఉంటే ….మా రూటే సెపరేట్ అంటున్నారట అక్కడి నేతలు. ఆరోపణలు వద్దు….అభివృద్ధి మీద ఢీ అంటే ఢీ అని కవ్వించుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. మహా విశాఖ అభివృద్ధి సంస్థ చుట్టూ సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ల పర్వం మొదలైంది. గ్లాస్ బ్రిడ్జి దగ్గర నుంచి మాస్టర్ ప్లాన్ వరకు అన్నీ తేల్చేసుకుందామనే లెవల్లో డిస్కషన్ ఊపందుకుంది. ఈ క్రెడిట్ ఫైట్ వెనుక అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయా? ధూంధాం వెనుక […]