Off The Record : ఆ ఇద్దరు బీజేపీ నేతలే కానీ వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఇద్దరూ.. బీజేపీ నేతలే… కానీ వారి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.కమలం పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా?కాంట్రాక్టు పనుల కోసం ఇద్దరు నేతల వర్గీయుల మధ్య మళ్లీ వివాదం మొదలైందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహానికి కారణం ఏమిటి ? కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గండికోట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కేంద్రమంత్రి చొరవతో సాస్కి పథకం కింద 80 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.అందులో భాగంగా 50 కోట్ల రూపాయలకు టెండర్లను పిలిచింది పురావస్తు శాఖ. ఆ టెండర్లను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. రెండు నెలల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోటలో సాస్కి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తరువాత రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది.కానీ గత వారం రోజుల నుంచి రిత్విక్ సంస్థ ప్రతినిధులకు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు మధ్య వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. స్మశాన స్థలం లో రిత్విక్ సంస్థ నిర్మాణాలు చేపడుతొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సంస్థ చేపడుతున్న పనులను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే వర్గీయులు రిత్విక్ సంస్థ కార్యాలయంపై ఎటాక్ చేశారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట గ్రామంలో చేపడుతున్న సాస్కి పనులను నిలిపివేయలని గ్రామస్తులు డిమాండ్ చేశారట.కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పనులు చేయవద్దని వారు అంటున్నారట… ఎంత చెప్పినా వినకుండా రిత్విక్ సంస్థ పనులు చేపడుతున్నారనేది వారి ఆరోపణ.దీంతో రిత్విక్ సంస్థ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ద్వంసం చేశారు. అంతేకాకుండా అడ్డు వచ్చిన సిబ్బందిపై కూడా ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకోవడం కోసం తమ సంస్థ పై దాడి చేశారని రిత్విక్ సంస్థకు చెందిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆదాని సంస్థ కు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులను రిత్విక్ సంస్థ చేపట్టింది. అక్కడ తమ వర్గీయులకు కాకుండా వేరే వాళ్లకు పనులు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఆ సంస్థ కార్యాలయం పై దాడి చేశారు. ఈ ఘటన మరవకమునుపే మరోసారి రిత్విక్ సంస్థ కార్యాలయం పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో కాంట్రాక్టు పనుల కోసమే ఇలా చేసి ఉంటారనేది ఎంపీ వర్గీయుల వెర్షన్. ఏది ఏమైనా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు, అదే పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ సంస్థకు మధ్య వార్ మొదలైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇది ఎక్కడిదాకా వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read
- Tags
- AP BJP
- ntv
- off the record
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!