హైదరాబాద్ గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణలో మరో పెద్ద క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. కూలీలు, రైతులు, ఉద్యోగుల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్లు బయటపడింది.
హైదరాబాద్లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి.
Ind vs Ban : ఆసియా కప్లో భారత్ ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇచ్చిన 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కడే ప్రతిఘటిస్తూ 69 పరుగులు సాధించాడు. అయితే మిగతా 9 మంది బ్యాటర్లు రెండంకెల […]
Inter Board : రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ సిలబస్లో మార్పులు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రకటించారు. పరీక్షల పద్ధతిలో కూడా మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. నవంబర్ నెల నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనివల్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులు సిద్ధం […]
పార్టీ మారిన ఆ ఆరుగురు ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహామేంటి? వారి మీద అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తుందా? లైట్ తీసుకుంటుందా? 15 నెలలుగా తమ రాజీనామాల విషయంలో ఎటు తేల్చటం లేదంటూ కోర్టు వరకు వెళ్లిన ఎమ్మెల్సీలకు వైసీపీ వ్యూహం అంతుపట్టడం లేదా?వీరి విషయంలో జగన్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితం కావటంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. హోదా లేకుంటే సభలో మాట్లాడేందుకు సమయం […]
హైదరాబాద్ నగరంలో విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడడం, ఆస్తులను కాపాడడం వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది.
తానొకటి తలిస్తే… జరిగేది మరొకటి అన్నట్లు ఉందట ఆ ఎమ్మెల్యే పరిస్థితి. ప్రాంత అభివృద్ధి ఎజెండాగా వేసిన అడుగులు… సత్ఫలితలివ్వక పోగా కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయట. ప్రభుత్వ పెద్దల తీరుతో ఆ ఎమ్మెల్యే మాట్లాడిన నైరాశ్యపు మాటలు … ఆయన అసంతృప్తికి అద్దం పడుతున్నా యని చర్చించుకుంటున్నారు.ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..?ఎరక్కపోయి..ఇరుక్కుపోయారా?అసలేం జరిగింది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరోసారి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మారిన రాజకీయ […]
దిల్సుఖ్నగర్ కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ వరుంధ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు బి. నరసింహ రెడ్డి, బి. ఆషుతోష్ రెడ్డి ప్రారంభించారు. హబ్సిగూడలో తొలి బ్రాంచ్తో విజయవంతంగా కొనసాగుతున్న వరుంధ షాపింగ్ మాల్, ఇప్పుడు కొత్తపేటలో రెండవ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ షాపింగ్ మాల్ ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్గా అక్టోబర్ 2 వరకు 5000 రూపాయల పైగా షాపింగ్ చేసిన […]
కాపీరైట్ కేసులో ఊరట గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్ను అనుమతించడంతో పాటు, […]