Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Congress Government

Off The Record : చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతున్న ప్రభుత్వం

Published Date :September 23, 2025 , 9:45 pm
By Gogikar Sai Krishna
Off The Record : చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతున్న ప్రభుత్వం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record : తెలంగాణ ప్రభుత్వ పెద్దలు,కాంగ్రెస్ నేతలు.. చేసింది కూడా చెప్పుకోలేక పోతున్నారా..? మంచి చేసిన చెప్పుకోలేకపోవడంతో ప్రత్యర్థులు చేసే ప్రచారమే పైచేయిగా మారుతుందా? చెప్పేవాళ్లు లేకనా… ఏమవుతుందిలే అని వదిలేస్తున్నారా..? పదేపదే అదే లోపం కనిపిస్తోందా?. ఇంతకీ ఆ లోపమెక్కడుంది?చేసింది ఏమీ లేకపోతే చెప్పుకోకపోవడం అనేది ఉండదు.. ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి. కానీ చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతోంది ప్రస్తుత ప్రభుత్వం. చేసింది చెప్పుకునే వరకు ప్రతిపక్షం దాన్ని రాచీ రంపాన పెట్టీ… వాళ్ళు చెప్పిందే నిజమేమో అనే స్థాయిలో బ్రాంతి కల్పించే వరకు వెళుతుంది. జరుగుతున్న వ్యవహారం.. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు తెలియదా అనుకుంటే పొరపాటు. తెలిసినా కూడా ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు అనేది అంతుచిక్కని సమస్యగా మారింది.

తెలంగాణలో ఇటీవల రైతాంగం యూరియా కొరతతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. రైతులకు యూరియా సకాలంలో అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం మొదలుకొని మంత్రుల వరకు అంతా కేంద్ర ప్రభుత్వాన్ని మాకు సకాలంలో యూరియా అందించండి అని వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు కానీ అనుకున్నంత స్థాయిలో యూరియా సరఫరా కాలేదు. కారణం ఏదైనా కావచ్చు దీన్ని కూడా యూరియా అందించాల్సిన బీజేపీనే… రాష్ట్రంపై నెపంవేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అడపా దడపా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పితే కేబినెట్‌లో ఉన్న ముఖ్యమైన మంత్రులు ఎవరు అది తమ విషయమే కాదన్నట్టు లైట్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేని యూరియా విషయంలోనే ప్రతిపక్షం.. రేవంత్ సర్కారు వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారని రేంజ్ లో ప్రచారం చేశారు. అయినా చీమకు కుట్టినట్టు కూడా లేదు….అటు కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులకు ఇటు పార్టీలో ఉన్న నేతలకు.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

యూరియా సంగతి అలా ఉంటే… తాజాగా హైదరాబాదులో హైడ్రా వ్యవహారం మరొకటి. గాజులరామారం ఏరియాలో ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జా దారులు వెనకాల ఉండి ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం జరిగింది అంటూ హైడ్రా చెప్తుంది. అందుకే పేదల పేరుతో వేసుకున్న భూ బకాసురుల నిర్మాణాలు కూల్చామని అని అంటోంది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడితే దానిపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ప్రతిపక్షం దీనిపై గగ్గోలు పెడుతుంటే కూడా మౌనంగానే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ భూమి కబ్జాకు గురైన బాధ్యులు… కబ్జా కి గురి అవుతున్న పట్టించుకోని అధికారుల గురించి అసలు దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. ప్రభుత్వ భూములను కాపాడే పని సర్కారు చేస్తున్న దాని వెనకాల భూకబ్జాదారులు.. దాంతో నష్టపోయే వాళ్లు రాజకీయంగా కాంగ్రెస్ ను డ్యామేజ్ చేస్తున్న ఎందుకో మౌనంగా ఉంటున్నారు.. అనేది సొంత పార్టీలోని నాయకులే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు… జిల్లా మంత్రులు కావచ్చు.. లేదంటే జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అంతెందుకు ఎంతో ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను అద్భుతంగా రూపొందించినా.. దాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయింది. చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత అనే స్టాటజీని రాజకీయ పార్టీలు బాగా వంట పట్టుకుంటాయి. కానీ తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీ చేసింది కూడా చెప్పుకోలేకపోతోంది. లోపం ఎక్కడ అనేది ప్రభుత్వ పెద్దలు… పార్టీ పెద్దలు తేల్చుకుంటే మంచిదేమో.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress government
  • NTV Telugu
  • off the record

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions