గుజరాత్లోని సూరత్లో ఓ వింత కేసు బయటకు వచ్చింది. 13 ఏళ్ల విద్యార్థి 23 ఏళ్ల మహిళా టీచర్ను గర్భావతిని చేశాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న SMIMER ఆసుపత్రిలోనే ఆ మహిళ గర్భస్రావం చేయాలని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. అలాగే డీఎన్ఏ పరీక్ష కోసం పిండాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ లేడీ టీచర్ 22 వారాల గర్భవతి.
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్కి బాగా అబ్బుతుంది.
ఎండాకాలం మొదలైంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎండాకాలంలో హైడ్రేషన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు బెస్ట్ ఆప్షన్. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. అసలు కొబ్బరి…
ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు సంతానం స్పందించాడు. "మేము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీయలేదు. అలా ఉంటే కచ్చితంగా మాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు.
హీరో రామ్చరణ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్లో రామ్చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్చరణ్ లండన్కు వెళ్లారు. ఈ క్రమంలో మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్ బెల్ట్ను తన భుజంపై వేయమని చరణ్ను జూలియస్ కోరారు. వీరి కలయికకు సంబంధిత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి జూలియస్ బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్గా 5 సార్లు, కామన్వెల్త్ ఛాంపియన్గా 4 సార్లు…
ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. ఫైనల్ డెస్టినేషన్ పేరుతో రూపొందిన హాలీవుడ్ భయానక థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్లకు మించి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత 2003, 2006, 2009, 20011లో వరుసగా సిరీస్లు విడుదల కాగా.. ఇవి మేకర్స్ను డబ్బులతో ముంచెత్తాయి.
లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత చాటుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చారు. ‘స్ట్రాంగ్ పీపుల్’ అనే దానిపై చక్కటి విశ్లేషణ చేశారు. నార్మల్ పీపుల్కీ స్ట్రాంగ్ పీపుల్కి మధ్య చాలా తేడా ఉంటుందని.. ఆ తేడాను వివరించారు.
కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక దారుణ హత్య కేసు బయటపడింది. సౌరభ్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడితో కలిసి ఘోరంగా చంపిన విషయం తెలిసిందే. తన భర్త మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్ములో ఉంచి సిమెంట్తో ప్యాక్ చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి మరో కేసు బయటపడింది. ఈ కేసు కూడా ఉత్తరప్రదేశ్కి చెందినదే. రాష్ట్రంలోని బల్లియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.