India-Pakistan: భారత్ను కాపీ కొట్టిన పాకిస్థాన్..
- భారత్ కాపీ కొడుతున్న పాకిస్థాన్
- చాలా అంశాల్లో కాపీ కొట్టిన పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకున్నారు. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది” సామేత ప్రస్తుతం పాకిస్థాన్కి బాగా అబ్బుతుంది.
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
1) భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరిట.. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ అనంతరం.. పాకిస్థాన్ ఆపరేషన్ బన్యన్ అల్ మర్సూస్ను ప్రారంభించింది. దీని అర్థం గాజు లాంటి బలమైన గోడ. ఈ ఆపరేషన్ కింద.. పాకిస్థాన్ భారతదేశంలోని నివాస ప్రాంతాలపై దాడి చేసింది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. ఈ ఆపరేషన్తో ప్రపంచం ముందు తనను తాను బలంగా చూపించుకోవడానికి ప్రయత్నించిన పాక్ ఘోరంగా విఫలమైంది.
2) సైన్యంలో మనోధైర్యాన్ని పెంచేందుకు ఇటీవల భారత ప్రధాని మోడీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్కు చేరుకుని సైనికులను కలిసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రధాని ఈ అంశాన్ని కూడా కాపీ కొట్టారు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సియాల్కోట్లోని పస్రూర్ ఆర్మీ క్యాంప్కు చేరుకున్నారు. పాకిస్థాన్ సైనికులను కలిశారు. మే 10న భారత సైన్యం ఈ ఆర్మీ క్యాంప్ యొక్క రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినందున షరీఫ్ ఇక్కడికి వచ్చారు. ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన మాదిరిగానే.. షరీఫ్ కూడా సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
3) ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం నిరంతరం పత్రికా సమావేశాల నిర్వహించింది. తాజా పరిస్థితులను దేశ ప్రజలకు తెలియజేస్తూనే ఉంది. మరోవైపు, పాకిస్థాన్ ISPR DG మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి సమాచారం గురించి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ కూడా తన వైమానిక దళం ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ ను విలేకరుల సమావేశాల్లో పాల్గొనేలా చేసింది. కానీ.. వచ్చి రానీ ఇంగ్లీష్ కారణంగా ఔరంగజేబ్ అహ్మద్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాడు.
4) పాకిస్థాన్ యుద్ధభూమిలోనే కాదు.. క్రికెట్ మైదానంలో కూడా భారతదేశాన్ని కాపీ కొట్టింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు భారత్ ఐపీఎల్ను వాయిదా వేసింది. కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత.. మే 17 నుంచి కొత్త షెడ్యూల్తో ఐపీఎల్ తిరిగి జరుగుతుందని ప్రకటించారు. పాక్లో కూడా మే 9న తన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. మే 17 నుంచి PSLను పునఃప్రారంభించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తేదీని కూడా కాపీ చేయడంతో సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..