పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. దేశాన్ని ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వని రైతు ప్రకృతి ముందు కూడా నిస్సహాయుడవుతున్నాడు. చలి, వేడి, ఎండ, వానలను భరించి తాను పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే అక్కడ కూడా పంటకు రక్షణ లేకుండా పోతోంది. అకాల వర్షాల వల్ల వారి పంటలు కొట్టుకుపోతే.. ఆ అన్నదాత ఎంత ఆవేదనకు గురవుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్…
జుట్టు అనేది ఆడవారితో పాటు మగవారికి కూడా ముఖ్యమే. జుట్టు ఆడ, మగవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా ఉండటం అమ్మాయిలకు ఎంత ఇష్టమో.. తలపై ఒత్తుగా, నిండైన హెయిర్ ఉండటం కూడా అబ్బాయిలకు అంతే ఇష్టం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది యువత బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మానసికంగా వారిని చిదిమేస్తుంది. కాగా.. బట్టతల రావడంపై అనేక అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ప్రధానమైన ప్రశ్న వంశపారపర్యంగా బట్టతల వస్తుందా? అనేది. ఇప్పుడు మనం దీనికి…
బీహార్ రాజధాని పాట్నా నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. నిన్న రాత్రి, SK పూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్పురి ప్రాంతంలో సంజన అనే యువతి తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఆమె సజీవ దహనమై కనిపించింది. సంజన మెడను ఎవరో నరికారు. ఆమె శరీరంపై అనేక దెబ్బలు కనిపించాయి. ఈ విధంగా.. 28 ఏళ్ల సంజన కుమారి తన సొంత ఫ్లాట్లోనే దారుణంగా హత్య చేయబడింది. సంజన స్నేహితుడు సూరజ్ కుమార్ ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అతడు…
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని గిల్ ని కెప్టెన్ చేయడంపై ఆందోళన…
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక భారత సముద్ర సరిహద్దుకు దగ్గరగా రావడంపై…
ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా వేడిని తట్టుకోలేవు. ఎక్కువ వాడకం వల్ల సెల్ఫోన్లు వేడెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సెల్ ఫోన్లకు మరింత చేటు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో వీడియో కాల్ మాట్లాడొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడొద్దని సూచిస్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో.. బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్, జీపీఎస్ వంటి సర్వీసులను ఆఫ్ చేయాలని చెబుతున్నారు. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ.. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఈ ఘటన తాజాగా జైపూర్లోని విరాట్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత సమయంలో బీహార్కు చెందిన ఓ జావాన్ అమరవీరుడయ్యారు. ఆ అమరవీరుడికి వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయ్యింది. ఈ వార్త విన్న భార్య షాక్కి గురైంది. ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భార్యను ఒంటరిగా వదిలేశాడు. వాస్తవానికి తమది ప్రేమ వివాహమని ఆ సైనికుడు రాంబాబు భార్య అంజలి తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం 8 సంవత్సరాలుగా కొనసాగిందని.. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా సంవత్సరాలు పట్టిందని ఆ నవ…
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ నివాసి రాజ్కుమార్ మిశ్రా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆయన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి మేయర్ ఎన్నికల్లో గెలిచారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్ లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.