China’s Spy Ship: పాకిస్థాన్తో ఉద్రిక్తతలు.. భారత్ సమీపంలో చైనా గూఢచారి నౌక..
- భారత జలాల దగ్గరకు చైనా గూఢచారి నౌక
- ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో
- ఈ నౌక కార్యకలాపాలపై అనుమానాలు
- ఇది సముద్ర సర్వే నౌక అని చెబుతున్న చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక భారత సముద్ర సరిహద్దుకు దగ్గరగా రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
READ MORE: Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులపై సర్కార్ కీలక నిర్ణయం..
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) ప్రకారం.. చైనా భూగర్భ శాస్త్రం, భౌగోళిక భౌతిక సర్వే నౌక డా యాంగ్ యి హావో – సముద్రగర్భాన్ని మ్యాప్ చేయగలదు. సబ్మెర్సిబుల్ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. తాజాగా ఈ నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ నౌక మే 12-13 తేదీల మధ్య అండమాన్, నికోబార్ దీవులను దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చేరుకుంది. మే 14న, ఇది భారతదేశానికి ఆగ్నేయంగా హిందూ మహాసముద్రంలో కనిపించింది. అప్పటి నుండి ఓడ దాని ట్రాన్స్పాండర్ను ఆపివేయడం వలన దాని స్థానాన్ని ట్రాక్ చేయడం కష్టమైంది.
READ MORE: Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయం..
పాకిస్థాన్కు చైనా ఎలా సహాయం చేయగలదు?
చైనా తన గూఢచారి నౌకల సహాయంతో భారత జలాల్లో జలాంతర్గాముల కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు. ఆ గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. పాక్కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చని అనుమానాలు. ఒకవేళ పాకిస్థాన్లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే, వాటిని ముందుగానే పసిగట్టి, సదరు సమాచారాన్ని పాకిస్థాన్కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు.
చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) కింద చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సీపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండటం డ్రాగన్కు అత్యంత కీలకం. అది కూడా నిఘా వెనక కారణం కావొచ్చు. భారతదేశంపై నిఘా ఉంచడంలో పాకిస్తాన్ నావికాదళానికి సహాయపడుతుంది. ఈ నౌక భారత నావికా దళాల మధ్య కమ్యూనికేషన్లను అడ్డుకోగలదు. భారతీయ కార్యాచరణ ప్రోటోకాల్లు, సంక్షోభ ప్రతిస్పందనలపై సమాచారాన్ని అందిస్తుంది.
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!