Jaipur: ఆభరణాల్లో వాటా కోసం తల్లి అంత్యక్రయలు ఆపిన కుమారుడు..(వీడియో)
- బెహ్రోర్ జిల్లా లీలా కా బాస్ గ్రామంలో ఘటన
- ఆభరణాలు ఇవ్వాలని తల్లి చితిపై పడుకున్న కొడుకు
- రెండు గంటలు ఆగిన దహనం సంస్కారాలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ.. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఈ ఘటన తాజాగా జైపూర్లోని విరాట్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
READ MORE: Pakistan: భారత్ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
రాజస్థాన్ కోట్పుట్లి-బెహ్రోర్ జిల్లా లీలా కా బాస్ గ్రామానికి చెందిన భూరి దేవి(80) మే 3న మరణించారని స్థానికులు తెలిపారు. ఆమెకు ఏడుగురు కుమారులు ఉన్నారు. అందులో ఆరుగురు గ్రామంలో కలిసి నివసిస్తున్నారు. ఐదవ కుమారుడు ఓంప్రకాష్ విడివిడిగా నివసిస్తున్నాడు. ఓంప్రకాష్, అతని తోబుట్టువుల మధ్య చాలా సంవత్సరాలుగా ఆస్తి వివాదం సాగుతోంది. తన తల్లి చనిపోయే రోజు వరకు ఆమె బాధ్యతలను పెద్ద కొడుకు చూసుకున్నాడు. అయితే.. ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర బంగారు ఆభరణాలు కుటుంబ పెద్దలు పెద్ద కొడుకుకి అప్పగించారు.
READ MORE: Indus Water Treaty: పాక్కి షాక్ ఇవ్వనున్న భారత్.. సింధు నదులపై కాలువలు, ప్రాజెక్టులకు శ్రీకారం..
అయితే.. ఇంట్లో చివరి కర్మలు పూర్తి చేశారు. అంత్యక్రియల ఊరేగింపు శ్మశాన వాటికకు చేరుకుంది. ఓంప్రకాష్ కూడా శవపేటికను తీసుకెళ్లడానికి సహాయం చేశాడు. దహన సంస్కార స్థలానికి చేరుకున్న ఓంప్రకాష్ వెంటనే ఆందోళన చేయడం ప్రారంభించాడు. తన తల్లి చితిని తగుల బెట్టకుండా, అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడు. అకస్మాత్తుగా ఆ చితిపై పడుకున్నాడు. తన తల్లి ఆభరణాలు తనకు ఇవ్వకపోతే దహన సంస్కారాలు చేయనివ్వను అని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ, ఓంప్రకాష్ దాదాపు రెండు గంటల పాటు చితిపై నుంచి దిగడానికి నిరాకరించాడు. ఆభరణాలను దహన సంస్కారాల స్థలానికి తీసుకువచ్చి అతనికి అప్పగించిన తర్వాతే భూరి దేవి అంత్యక్రియలు పూర్తి చేయడానికి అనుమతించాడు. ప్రస్తుతం ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు ఓం ప్రకాష్పై మండిపడుతున్నారు.
इंसान किधर जा रहा है ?
राजस्थान के शाहपुरा में चांदी के कड़े के लिए बेटे ने माँ का अंतिम संस्कार रोका! अर्थी पर लेट गया।#rajasthan pic.twitter.com/nuw5wfQfP7— Mukesh Mathur (@mukesh1275) May 16, 2025
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!