India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
- ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు
- ఏడు డెలిగేషన్స్ను ఏర్పాటు చేసిన కేంద్రం
- శశిథరూర్ నేతృత్వం యూఎస్ బృందం
- పాకిస్థాన్ తీరును ఎండగట్టనున్న సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
READ MORE: Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్బాబుపై కేసు కొట్టివేత.. “ఇది రైతుల విజయం, ప్రజల గెలుపు”
Also Read
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
కాంగ్రెస్ ఇచ్చిన లిస్టులో శశిథరూర్ లేకపోయినా.. ఆయనను కేంద్రం ఎంపిక చేసింది. సుప్రియా సూలే మూడో బృందాన్ని లీడ్ చేయనున్నారు. విదేశాలకు వెళ్లే ఏడు బృందాలకు.. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) నాయకత్వం వహించనున్నారు. మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. పాక్ నిజరూపాన్ని వాటి ఎదుట ఎలా ఆవిష్కరించాలో ముందుగానే ఎంపీలకు కేంద్రం వివరించనుంది.
READ MORE: Anchor Shyamala: ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం!
ప్రపంచ దేశాలకు భారత్ బృందాలు ఏం చెబుతాయి?
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమయ్యేలా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యల గురించి ఈ బృందాలు వివరిస్తాయి. పాక్ చర్యలకు దీటుగా ఆపరేషన్ సిందూర్ను ఎలా చేపట్టిందో చెప్తారు. భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇస్తారు. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదనే అంశాన్ని నొక్కిచెప్పనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నోఏళ్లుగా పాకిస్థాన్ అనుసరిస్తున్న పాత్ర, దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరిస్తారు.
తాజావార్తలు
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..