Bihar: ‘నా భర్త మృతదేహంతో అరగంట ఉండనివ్వండి’.. జవాన్ భార్య ఆవేదన!
- భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య అమరుడైన జవాన్
- ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్
- ఐదు నెలలు కిందట రాంబాబుకు అంజలీతో వివాహం
- 8 సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఈ జంట
- కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకున్న జంట
- అంతలోనే అంజలిని ఒంటరిని చేసిన జవాన్ రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత సమయంలో బీహార్కు చెందిన ఓ జావాన్ అమరవీరుడయ్యారు. ఆ అమరవీరుడికి వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయ్యింది. ఈ వార్త విన్న భార్య షాక్కి గురైంది. ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భార్యను ఒంటరిగా వదిలేశాడు. వాస్తవానికి తమది ప్రేమ వివాహమని ఆ సైనికుడు రాంబాబు భార్య అంజలి తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం 8 సంవత్సరాలుగా కొనసాగిందని.. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా సంవత్సరాలు పట్టిందని ఆ నవ వధువు వాపోయింది.
READ MORE: Toilet seat explode: టాయ్లెట్ సీట్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు.. అసలు ఎందుకు ఇలా జరిగింది..?
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
అమరవీరుడు రాంబాబు వసిల్పూర్ సివాన్ జిల్లాలోని బర్హరియా బ్లాక్ నివాసి. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అమరవీరుడిని చివరి చూపు చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. అతని భార్య, తల్లి మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు. అంత్యక్రియలకు ముందు.. తన చివరి కోరిక ఏంటని ఆ భార్యను సైనిక సిబ్బంది అడిగింది. ఆమె చెప్పిన సమాధానం విన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు.
” నా భర్త రాంబాబు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లే ముందు మా గదికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. నా రాంబాబుని నాతో చివరగా ఒక్క అరగంట వదిలేయండి.” అని అంజలి ఆర్మీ అధికారులతో చెప్పింది. ఇది విన్న సైనిక సిబ్బంది వెంటనే మృతదేహాన్ని గదికి తీసుకెళ్లారు. దాదాపు అరగంట పాటు గదిని మూసి ఉంచారు. రాంబాబు కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారు. అనంతరం అమరవీరుడి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా.. వివాహం తర్వాత.. రాంబాబు ఎక్కువ సమయం విధుల్లోనే ఉన్నారు. అమరవీరుడైన రోజు కూడా ఉదయం తన భార్యతో ఫోన్లో మాట్లాడారు. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తానని మాట ఇచ్చారు. కానీ మే 13న, అకస్మాత్తుగా మరణవార్త బయటకు వచ్చింది.
READ MORE: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!