Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీ.. ఈ పేరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. అపార శక్తులు ఉన్నాయంటూ ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగింది. చాలా మంది తెలుగు ప్రజలు ఆ యువకుడికి కలవడానికి బారులు తీరేవారు. ఆ మధ్య కొన్ని విమర్శలు రావడంతో కనుమరుగైపోయాడు. తాజాగా మరోసారి మల్లికార్జున ముత్యా వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని యాద్గిర్లో స్వయంఘోషిత స్వామిగా పేరుపొందిన మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదవడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ…
Tilak Varma: నిన్న జరిగిన మ్యాచ్కు ముందు అభిషేక్ శర్మపై ఏ మేరకు చర్చలు జరిగాయో.. తెలుగు తేజం తిలక్ వర్మ అంశలోనూ అదే స్థాయిలో చర్చలు సాగాయి. తిలక్ బ్యాటింగ్ ఆర్డర్, ఫామ్పై అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. చెన్నైలో జింబాబ్వేపై జరిగిన సూపర్ 8 మ్యాచ్లో వాటికి తిలక్ చెక్ పెట్టేశాడు. విమర్శకుల నోళ్లను బ్యాట్తో మూయించేశాడు. టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు తిలక్ ప్రదర్శన నిరాశాజనకంగానే ఉంది. యూఎస్ఏ, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై అతని స్కోర్లు 25, 25, 25,…
Rampachodavaram Agency; పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్దపులి రంపచోడవరం ఏజెన్సీలోకి ప్రవేశించడంతో రచ్చ ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాలపైకి పెద్దపులిని విడిచిపెట్టారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు రక్షించుకునేందుకు బాణాలు, విల్లులు, ఆయుధాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు. ఈనెల 6న రాజమండ్రి వద్ద బంధించిన పెద్దపులికి ఎక్స్ ప్లోరర్ అనే పేరు పెట్టి 14న పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే ఆ పెద్దపులి గత ఐదు రోజులుగా రంపచోడవరం ఏజెన్సీలోని బోలగొండ ఫారెస్ట్ లోని రంప, మర్రవాడ,…
Arshdeep Singh: చైన్నై వేదికగా జరిగిన భారత్ vs జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు భారీ విజయంగా మారింది. ఏకంగా 72 పరుగులు తేడాతో భారత్ గెలవడంతో సెమీస్ ఆశలు పుంజుకున్నాయి. ఇక ఈ మ్యా్చ్లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరో చరిత్ర సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు.. 3 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్, టీ20 వరల్డ్కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందు ఆ రికార్డు…
Suryakumar Yadav: జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. 72 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దీంతో సెమీస్పై ఆశలు చిగురించాయి. చెన్నై వేదికగా జింబాబ్వేపై భారత్ సాధించిన 72 పరుగుల ఘన విజయం టీ20 వరల్డ్కప్ సూపర్ ఎయిట్స్లో జట్టుకు ఊపిరి పోసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయం తర్వాత ఈ గెలుపు రెండు పాయింట్లతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని సైతం తిరిగి తీసుకొచ్చింది. బ్యాటింగ్ విభాగం ఈ మ్యాచ్లో అసలైన రూపం చూపించింది. తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలై, ఇన్నింగ్స్…
Pakistan: ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. తాజాగా ఇరు దేశాల సరిహద్ద వద్ద దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీన్ని ఓపెన్ వార్ గా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తతగా మారాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. “మా సహనం ముగిసింది.…
Shoaib Akhtar: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్థాన్ టీమ్కి కెప్టెన్సీ చేయలేదు.. పాకిస్థాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇప్పటికీ…
Hyderabad: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భవనంలో షాపింగ్ మాల్ సిబ్బంది చిక్కుకోగా వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వారిని రక్షించారు. పై ఫ్లోర్లో కార్మికులు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎలివేషన్ కట్టడంపై పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు అదుపులోకి వచ్చాయి..
Meghalaya: భర్త ముఖ్యమంత్రి.. భార్య ఎమ్మెల్యే.. వ్యక్తిగత బంధాలు వదిలేసి ఇద్దరూ అసెంబ్లీలో సమస్యలపై చర్చిస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఘటనే తాజాగా మేఘాలయ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా (Mehtab Chandee A Sangma), ముఖ్యమంత్రి కాన్రాడ్ కొంగల్ సంగ్మా (Conrad K Sangma) భార్యాభర్తలు. తాజాగా భార్య మెహతాబ్ చండీ పశుసంవర్ధక విద్యాసంస్థల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిని వివరణ కోరారు. ఓ వైపు కుటుంబ సంబంధాలను పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై…
Telangana Vehicle Price Hike: కొత్తగా వాహనం తీసుకునే వాళ్లకు బిగ్ షాక్ వచ్చేసింది. తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.