Arshdeep Singh: బుమ్రా రికార్డుకు బ్రేక్.. టీ20 వరల్డ్కప్లో అర్ష్దీప్ నయా హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh: చైన్నై వేదికగా జరిగిన భారత్ vs జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు భారీ విజయంగా మారింది. ఏకంగా 72 పరుగులు తేడాతో భారత్ గెలవడంతో సెమీస్ ఆశలు పుంజుకున్నాయి. ఇక ఈ మ్యా్చ్లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరో చరిత్ర సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు.. 3 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్, టీ20 వరల్డ్కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందు ఆ రికార్డు బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 33 వికెట్లతో ముందుండగా, అర్ష్దీప్ ఈ మ్యాచ్తో తన మొత్తం వికెట్ల సంఖ్యను 35కు చేర్చి యార్కర్ కింగ్ను అధిగమించాడు. కేవలం 19 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది. అర్షదీప్ సింగ్ సగటు 14.25 కాగా, ఎకానమీ 7.33గా ఉండటం బౌరల్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. ప్రస్తుత టోర్నీలోనూ ఐదు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసి జట్టులో రెండో అత్యధిక వికెట్ల బౌలర్గా కొనసాగుతున్నాడు.
READ MORE: Nikhil : ఓటీటీలోకి నిఖిల్ ఎంట్రీ.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదుగా!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభంలోనే అర్ష్దీప్ తన ముద్ర వేశాడు. మొదటి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడి సృష్టించాడు. రెండో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చినా, చివరి దశలో తిరిగి వచ్చి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. 17వ ఓవర్లో సికందర్ రజా (21 బంతుల్లో 31)ను లాంగ్-ఆన్ వద్ద క్యాచ్ అవుట్ చేయించాడు. వెంటనే ర్యాన్ బర్ల్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి రెండు బంతుల్లో డక్గా పెవిలియన్కు పంపించాడు. చివరి ఓవర్లో టోనీ మున్యోంగా స్టంప్స్ను ఎగరగొట్టి తన మూడు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. మొత్తం మీద 184/6కే జింబాబ్వేను పరిమితం చేసి భారత్కు సునాయాస విజయం అందించాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 256/4 భారీ స్కోరు సాధించింది. ఈ టోర్నీలో అంతగా రాణించని అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో చెలరేగి 30 బంతుల్లో 55 పరుగులతో తన తొలి అర్ధశతకం నమోదు చేశాడు. అతని దూకుడు ఆరంభం జట్టుకు బలమైన పునాది వేసింది. చివర్లో పాండ్యా (23 బంతుల్లో అజేయ 50), తిలక్ వర్మ (16 బంతుల్లో అజేయ 44) కేవలం 31 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జింబాబ్వే బౌలర్లను తిప్పలు పెట్టారు. ఎట్టకేలకు మ్యాచ్ గెలిచి సెమీస్ ఆశలు పెంచారు.
READ MORE: Pakistan: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. ఆఫ్ఘనిస్థాన్తో ‘ఓపెన్ వార్’ ప్రకటన.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!