Arshdeep Singh: బుమ్రా రికార్డుకు బ్రేక్.. టీ20 వరల్డ్కప్లో అర్ష్దీప్ నయా హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh: చైన్నై వేదికగా జరిగిన భారత్ vs జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు భారీ విజయంగా మారింది. ఏకంగా 72 పరుగులు తేడాతో భారత్ గెలవడంతో సెమీస్ ఆశలు పుంజుకున్నాయి. ఇక ఈ మ్యా్చ్లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరో చరిత్ర సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు.. 3 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్, టీ20 వరల్డ్కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందు ఆ రికార్డు బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 33 వికెట్లతో ముందుండగా, అర్ష్దీప్ ఈ మ్యాచ్తో తన మొత్తం వికెట్ల సంఖ్యను 35కు చేర్చి యార్కర్ కింగ్ను అధిగమించాడు. కేవలం 19 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది. అర్షదీప్ సింగ్ సగటు 14.25 కాగా, ఎకానమీ 7.33గా ఉండటం బౌరల్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. ప్రస్తుత టోర్నీలోనూ ఐదు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసి జట్టులో రెండో అత్యధిక వికెట్ల బౌలర్గా కొనసాగుతున్నాడు.
READ MORE: Nikhil : ఓటీటీలోకి నిఖిల్ ఎంట్రీ.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదుగా!
Also Read
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభంలోనే అర్ష్దీప్ తన ముద్ర వేశాడు. మొదటి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడి సృష్టించాడు. రెండో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చినా, చివరి దశలో తిరిగి వచ్చి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. 17వ ఓవర్లో సికందర్ రజా (21 బంతుల్లో 31)ను లాంగ్-ఆన్ వద్ద క్యాచ్ అవుట్ చేయించాడు. వెంటనే ర్యాన్ బర్ల్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి రెండు బంతుల్లో డక్గా పెవిలియన్కు పంపించాడు. చివరి ఓవర్లో టోనీ మున్యోంగా స్టంప్స్ను ఎగరగొట్టి తన మూడు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. మొత్తం మీద 184/6కే జింబాబ్వేను పరిమితం చేసి భారత్కు సునాయాస విజయం అందించాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 256/4 భారీ స్కోరు సాధించింది. ఈ టోర్నీలో అంతగా రాణించని అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో చెలరేగి 30 బంతుల్లో 55 పరుగులతో తన తొలి అర్ధశతకం నమోదు చేశాడు. అతని దూకుడు ఆరంభం జట్టుకు బలమైన పునాది వేసింది. చివర్లో పాండ్యా (23 బంతుల్లో అజేయ 50), తిలక్ వర్మ (16 బంతుల్లో అజేయ 44) కేవలం 31 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జింబాబ్వే బౌలర్లను తిప్పలు పెట్టారు. ఎట్టకేలకు మ్యాచ్ గెలిచి సెమీస్ ఆశలు పెంచారు.
READ MORE: Pakistan: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. ఆఫ్ఘనిస్థాన్తో ‘ఓపెన్ వార్’ ప్రకటన.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!