Pakistan: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. ఆఫ్ఘనిస్థాన్తో ‘ఓపెన్ వార్’ ప్రకటన.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. తాజాగా ఇరు దేశాల సరిహద్ద వద్ద దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీన్ని ఓపెన్ వార్ గా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తతగా మారాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. “మా సహనం ముగిసింది. ఇప్పుడు ఇది బహిరంగ యుద్ధం” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తున్నాయి.
READ MORE: Virosh wedding : ఎట్టకేలకు ఒక్కటైన ‘విరోష్’.. నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్!
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
కాగా.. గత ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలు మంది మరణించారని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం గురువారం రాత్రి పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి, డజను పైగా ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఈ భూదాడిలో తమ ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో శుక్రవారం పాకిస్థాన్ కాబూల్, కందహార్, పక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. కాబుల్లో కనీసం మూడు పేలుళ్లు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘాన్ వైపు నుంచి కాల్పులు జరగడంతోనే ఈ దాడులు జరిపామని పాకిస్థాన్ సైన్యం చెబుతోంది. Attaullah Tarar ప్రకారం.. కాబూల్, కందహార్, పక్తియాలోని తాలిబాన్ రక్షణ లక్ష్యాలపై దాడులు జరిగాయి. “ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్” పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం, రెండు బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, ఒక కార్ప్స్ హెడ్క్వార్టర్, గోలాల గోదాంలు ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ప్రాణనష్టంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహన్ నఖ్వీ కూడా ఆఫ్ఘాన్ తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుందని తీవ్రంగా విమర్శించారు. “దేశ భద్రతను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో పడనివ్వం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణలో నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ఓపెన్ వార్ ప్రకటించడం ఆందోళన కరంగా మారింది.
READ MORE: Toxic : రన్ టైం విషయంలో ‘ధురంధర్ 2’ తో పోటీ పడుతున్న ‘టాక్సిక్’..
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!