Anthropic AI: ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఏఐ ప్రముఖ్యత గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మరో పెద్ద అడుగు వేసింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఏఐ (Anthropic) తన క్లౌడ్ ఏఐ (Claude AI) కోసం కొత్త ఎంటర్ప్రైజ్ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీల్లోని వివిధ విభాగాల కోసం ప్రత్యేకంగా ప్లగిన్లు రూపొందించింది. ఈ కొత్త ప్లగిన్లతో మరోసారి సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండెల్లో గుబులు పెంచింది. ఏకంగా హెచ్ఆర్లకే ఎసరుపెట్టింది. ఇందులో హ్యూమన్ రిసోర్సెస్…
Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో రిస్కీ షాట్ ఆడుతూ పెవిలియన్కు చేరడంతో భారత్ ఒక్కసారిగా చతికిల పడింది. అప్పటికే మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి ఉండటంతో ఆ వికెట్ మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్కు ముందు వచ్చిన గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిలక్…
Save Punarvika: సేవ్ పునర్విక.. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు ఇది. పేరు కాస్త నినాదంలా మారింది. 11 నెలల పాపను ఎలాగైనా రక్షించాలని తెలుగు రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. సాధారణ జనాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెసర్లు ఒక్కసారిగా స్పందించి పాప ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బుల్ని ఎట్టకేలకు సమకూరేలా చేశారు. వైద్య చికిత్స సరిపడా నగదును సేకరించి చిన్నారి పునర్వికకు పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు తాజాగా పునర్విక తండ్రి సురేశ్కుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. "ఈ…
Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు.. పార్ట్ టైమ్లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. మూడేళ్లుగా మరో యుట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ.. యూట్యూబర్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది. ఈ నేపథ్యంలో…
Viral Video: ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే యువతలో ఊపు వస్తుంది. శివాజీ చరిత్ర చెబితే గూస్బంప్స్ పక్కా. సమ సమాజ స్థాపన, హిందూ రాజ్యం ఏర్పాటు కోసం శివాజీ చేసిన కృషి అంతా ఇంతా కాదు.. అలాంటి మహానీయుడి చిత్రపటానికి తాజాగా ఘోర అవమానం ఎదురైంది. పురుషులు, స్త్రీల బాత్రూమ్లు గుర్తు పట్టేలా సింబల్స్ ఉంచుతారన్న విషయం తెలిసిందే. ఇక్కడ పురుషుల బాత్రూమ్ బయట ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని ఉంచారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్లో ఈ…
Team India: టీమిండియాకు క్లిష్ట పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ రింకూ అకస్మాత్తుగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రింకూ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిన్న(మంగళవారం) పరిస్థితి విషమించడంతో రింకూ టోర్నీ నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. రింకూ తండ్రి స్టేజ్–4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా నిలవాలని భావించిన రింకూ జట్టు నుంచి తాత్కాలికంగా దూరమయ్యాడు. టోర్నమెంట్లో…
Pakistan vs England: పాకిస్థాన్కు భారీ ఎదురు దెబ్బ తగిలించింది. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్ను పాక్ కోల్పోయింది. టీ20 వరల్డ్కప్ సూపర్–8లో ఇంగ్లండ్తో రెండు వికెట్ల తేడాతో ఓడిపోవడం వల్ల సెమీఫైనల్ ఆశలు క్లిష్టంగా మారాయి. 165 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఛేజ్ చేయగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకం మ్యాచ్ను తమ వైపునకి తిప్పింది. 51 బంతుల్లో చేసిన ఈ సెంచరీ కేవలం మ్యాచ్ గెలిపించడమే కాదు.. ఇంగ్లండ్ను నేరుగా సెమీఫైనల్కు చేర్చింది. రెండు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్లతో…
Inter Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్లో 489126 మంది, సెకండియర్లో 507949 మంది కలిపి మొత్తం 997075 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష…
ICC Confirms New T20 World Cup Semi-Final Venues: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ వెన్యూకి సంబంధించి తాజాగా ఐసీసీ నుంచి కీలక సమాచారం వెలువడింది. ఇప్పటికే కొన్ని ఫీక్స్డ్ వెన్యూలు ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల వల్ల అదనంగా మరిన్ని వేదికలు ఖరారు చేసింది. ఐసీసీ కొత్తగా ప్రకటించిన ప్లేయింగ్ కండిషన్స్ వల్ల శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ ఆడే అవకాశం తెరుచుకుంది. వారు ఒకవేళ సెమీస్కు వెళితే.. అక్కడ ఏ జట్టుతో ఆడాల్సి వస్తుందనే అంశంపై వెన్యూ డిసైడ్ అవుతుంది. సూపర్–8…
Pakistan vs England: నేడు పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్కు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే.. ఇటీవల న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో చెరో పాయింట్స్ వచ్చాయి. దీంతో తాజాగా శ్రీలంకలోని కాండీలోని పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగే ఈ పోరు సెమీఫైనల్ ఆశల దృష్ట్యా పాకిస్థాన్కు అత్యంత కీలకంగా మారింది. ఇక ఇప్పటికే శ్రీలంకను ఓడించి రెండు పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ జట్టు పూర్తి ఫిట్గా కనిపిస్తోంది. అదే ఆత్మవిశ్వాసంతో…