Shoaib Akhtar: “మ్యాచ్కు ముందు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకునేవాడిని”.. షోయబ్ అక్తర్ సంచలన స్టేట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్థాన్ టీమ్కి కెప్టెన్సీ చేయలేదు.. పాకిస్థాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.. అయితే అప్పట్లో క్రికెట్ పోటీలు ఎంత భీకరంగా ఉండేవో పెద్దగా చెప్పనవసరం లేదు.
READ MORE: NtrNeel : డ్రాగన్ లో షర్ట్లెస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ ఫైట్
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్ తాజాగా ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. 1998-99లో భారత్ పర్యటన సమయంలో మోకాళ్ల నొప్పితో బాధపడుతూ మ్యాచ్ ఆడేందుకు తాను, పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ రహస్యంగా మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకున్నామని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మోకాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. మ్యాచ్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా చేశామని వెల్లడించాడు. సీనియర్లు తెలుసుకుంటే జట్టులో నుంచి బయటకు పంపించేవాళ్లని తెలిపాడు. ఈ విషయాన్ని ఓ టీవీ డిబెట్లో అక్తర్ బట్టబయలు చేశాడు. అయితే.. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని అక్తర్ వివరించాడు. నాడు సచిన్ వికెట్పై సక్లైన్, అక్తర్ మధ్య బెట్టింగ్ నడిచేదట. సచిన్ను ఎవరు ఔట్ చేస్తారన్నదే అంశంలో వారిలో వారే పోటీ పెట్టుకునే వారట. అప్పటి రైవల్రీ ఎంత తీవ్రంగా ఉండేదో ఈ మాటలు ద్వారా అర్థం అవుతుంది. ఒకవైపు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ వంటి బ్యాటర్లు అక్తర్ బౌలింగ్ను ఎదుర్కొని ఆధిపత్యం చెలాయించిన సందర్భాలున్నా.. కొన్ని మ్యాచ్ల్లో అక్తర్ పైచేయి సాధించాడు. కాగా.. భారత్-పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు ఈ రెండు జట్లు ఐసీసీ, ఆసియా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. తాజాగా టీ20 వరల్డ్కప్ 2026లోనూ భారత్ పాకిస్థాన్పై విజయం సాధించింది.
READ MORE: Puri Jagannadh: మరో తమిళ్ స్టార్ హీరోని పట్టేసిన పూరీ
తాజావార్తలు
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?