Jai Bapu Jai Bhim Jai Constitution: కాంగ్రెస్ పార్టీ జనవరి 3, 2025 నుండి “జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రచారం జనవరి 26, 2025న మధ్యప్రదేశ్లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. Also Read: Udayabhanu : విలన్ గా […]
Jio Recharge: ఇంట్లో Wi-Fi, ఆఫీస్ లో Wi-Fi కారణంగా మొబైల్ డేటా వినియోగం చాలా తక్కువగా ఉంటే.. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ కోసం వెతకడం చాలా సహజం. ఇందుకు తగ్గట్టు గానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, తక్కువ ధరలో ఎక్కువ చెల్లుబాటుతో ఉన్న రూ. 1899 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది తక్కువ డేటా వినియోగం ఉన్నవారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ […]
Introverts Day 2025: ఇతరులతో ఎక్కువగా కలవకపోవడం, తమ భావాలను బాహ్యంగా వ్యక్తపరచకపోవడం వంటి లక్షణాలతో కనిపించే వారిని “ఇంట్రావర్ట్” అంటారు. ప్రతి ఏటా జనవరి 2న ‘ఇంట్రోవర్ట్ డే’ (Introverts Day) ని జరుపుకుంటారు. ఇటువంటివారు ఎక్కువగా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లడం, ఇతరులతో మమేకం కావడం వారికి ఇష్టం ఉండదు. కొందరైతే ప్రతిదానికి మొహమాటపడిపోతుంటారు. అయితే, ఇంట్రావర్ట్లలో ఈ లక్షణాలు కొంతకాలానికి సమస్యలను తీసుకురావచ్చు. ఇకపోతే, ఇంట్రావర్ట్ల సమస్యల విషయానికి వస్తే.. […]
Akash Deep: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. వెన్ను సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆకాశ్ దీప్, సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండడని భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియాకు ఆకాశ్ దీప్ గైర్హాజరీ ఓ ఎదురుదెబ్బగా మారనుంది. గత రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు తీసి కీలక పాత్ర […]
Punishment For Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు, అతని స్నేహితురాలికి జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వెస్ట్మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే 27 ఏళ్ల తీగుళ్ల దయా సాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల ఫిలింనగర్లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు, దయా […]
Pregnant Women Precautions: అమ్మ కావడం అనేది ఎంతో అందమైన అనుభూతి. ప్రతి మహిళ తన జీవితంలో ఈ అద్భుతమైన క్షణాన్ని అనుభవించాలనుకుంటుంది. అయితే, గర్భవతిగా ఉండేటప్పుడు మహిళలు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అయితే, ఈ సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆమె భవిష్యత్ శిశువు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. శిశువు ఆరోగ్యకరంగా ఉండేందుకు గర్భవతిగా ఉన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం […]
Kusal Perera: కొత్త సంవత్సరం 2025లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే కుశాల్ పెరీరా ధాటిగా ఆడి రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తన తుఫాన్ సెంచరీతో జట్టుకు సంవత్సరంలో మొదటి రోజు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సెంచరీ కుశాల్ పెరీరాకు అంతర్జాతీయ టీ20లో శ్రీలంక బ్యాట్స్మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. కేవలం 44 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి, 219.56 స్ట్రైక్ రేట్తో.. 13 ఫోర్లు, 4 సిక్సర్ల […]
CMR College: హైదరాబాద్లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం […]
Police Constable:భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను భార్యతో తరచూ గొడవపడేవాడు. నాలుగైదు రోజులుగా […]
Rythu Bharosa: గురువారం (జనవరి 2) సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలకమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధానంగా రైతు భరోసా విధివిధానాలపై చర్చించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు విధానాలు చేయనున్నారు. రైతులకు ఆర్థిక […]