Suicide Case: దారుణం.. నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.!
- ఢిల్లీలో సంచలన ఘటన వెలుగులోకి.
- నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పిల్లల తల్లి ఇదివరకే క్యాన్సర్తో మరణించింది. శుక్రవారం అర్థరాత్రి పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. కుమార్తెలు వికలాంగులు కావడంతో తండ్రి ఈ చర్య తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు
Also Read
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
సమాచారం ప్రకారం, రంగపురి గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న తండ్రి వయస్సు సుమారు 46 సంవత్సరాలు. వీరు బీహార్ లోని ఛప్రా జిల్లా నివాసి. వారికి నలుగురు కుమార్తెలు. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్పెంటర్గా పనిచేశాడు. శుక్రవారం సాయంత్రం వారి ఫ్లోర్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు జరిగిన విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేయడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించారు.
Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..
మృతి చెందిన తండ్రి హీరాలాల్ శర్మ(46)గా గుర్తించారు. అతని నలుగురు కుమార్తెల వయస్సు 20 – 26 సంవత్సరాల మధ్య ఉంది. హీరాలాల్ గత 28 సంవత్సరాలుగా వసంత్ కుంజ్లోని ఇండియన్ స్పైనల్ ఇంజూరీ సెంటర్లో కార్పెంటర్గా పనిచేస్తున్నారు. 2024 జనవరి నుంచి డ్యూటీకి వెళ్లడం లేదని సమాచారం. అంతేకాదు, అతని ఇద్దరు కూతుళ్లు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు పాక్షికంగా వికలాంగులయ్యారు. హీరాలాల్ తన కూతుళ్లకు ఏదో ఒక ఆసుపత్రిలో చికిత్స చేయడంలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. కుమార్తెలు చాలా అరుదుగా తమ గదుల నుండి బయటకు వచ్చే వారు. ఇంట్లో నుంచి మూడు ప్యాకెట్ల విషం, ఐదు గ్లాసుల్లో అనుమానాస్పద ద్రవం, ఒక చెంచా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#WATCH | Delhi: Visuals from the spot where a family of 5, a man and his four daughters, committed suicide by consuming a poisonous substance in Vasant Kunj's Rangpuri Village. https://t.co/EgU0neHEw8 pic.twitter.com/XGGvHNOLYK
— ANI (@ANI) September 28, 2024
తాజావార్తలు
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!