Rohit Sharma: టీమిండియా కెప్టె్న్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. స్వదేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా నిలిచిన హిట్మ్యాన్.. ధోనీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో హెన్రీ షిప్లే వేసిన ఐదో ఓవర్లో సిక్స్ కొట్టడం ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం భారత గడ్డపై రోహిత్ 125 సిక్స్లతో మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ (123) రెండో ప్లేస్కు పడిపోయాడు. […]
Shruti Haasan: ఇప్పుడు టాలీవుడ్లో శ్రుతిహాసన్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్గా నటించింది. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో సీనియర్ హీరోల పక్కన శ్రుతిహాసన్ ఆడిపాడింది. దీంతో సంక్రాంతి శ్రుతిహాసన్దే అన్న చర్చ నడుస్తోంది. అయితే రెండు సినిమాల్లోనూ శ్రుతి పాత్రలు అంత గొప్పగా ఏం లేవనే టాక్ వచ్చింది. ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీలో పట్టుమని పావుగంట పాత్ర […]
GO First Airlines: ఇండియాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ గో ఫస్ట్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఎక్కడికైనా కేవలం రూ.1,199కే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు తక్కువ ధరకే అంతర్జాతీయ ప్రయాణం పొందవచ్చని సూచించింది. ఈ మేరకు రూ.6,599కే అంతర్జాతీయంగా విమాన టిక్కెట్లు పొందవచ్చని ట్వీట్ చేసింది. ఈ సేల్ ఈనెల 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటుందని.. ఈ టిక్కెట్లతో ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 […]
Junior NTR: మంగళవారం నాడు హైదరాబాద్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను టీమిండియా క్రికెటర్లు కలవడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకంగా ఎన్టీఆర్ను కలిసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన సతీమణి దేవిశాతో కలిసి ఎన్టీఆర్తో ప్రత్యేకంగా ఫొటో దిగాడు. ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సూర్యకుమార్.. ‘బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. […]
Andhra Pradesh: ఏపీలో వివాదాస్పదంగా మారిన జీవో నంబర్ 1పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి ముందే జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు […]
Sharukh Khan: ప్రపంచంలో బాగా సంపాదించేవారిలో చిత్ర సీమకు సంబంధించిన వాళ్లు కూడా ఉంటారు. భారీ సినిమాలకు కొందరు నటులు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ రిచెస్ట్ నటుల జాబితాను ట్విట్టర్ ఆఫ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ రిపోర్టు వెల్లడించింది. ఈ జాబితాలో టాప్-5లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. షారుఖ్ నుంచి నాలుగేళ్లుగా సినిమా రాలేదు. బ్రహ్మాస్త్రలో అతిథి పాత్రలో నటించినా అది అతడి ఖాతాలో రాదు. అయితే సంపాదన విషయంలో మాత్రం […]
Rohit Sharma: రేపు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్లో బలమైన టీమ్తో తాము ఆడబోతున్నామని.. తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి తమకు ఇది మంచి అవకాశమని రోహిత్ అన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో ఆడని ఇషాన్ కిషన్కు న్యూజిలాండ్తో సిరీస్లో అవకాశం కల్పిస్తామని.. అతడిని మిడిల్ ఆర్డర్లో పంపిస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. సిరాజ్ బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడని.. […]
Gudivada Amarnath: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని ఆయన ఆరోపించారు. దావోస్ సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందలేదనే దుష్ప్రచారాన్ని టీడీపీ ప్రారంభించిందని.. నవంబర్ 25నే ముఖ్యమంత్రి పేరు మీద ఆహ్వానం అందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ఏపీ అని.. 97వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి ఎగుమతులు జరిగాయని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ […]
Minister Roja: బాలయ్య అన్స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా వెళ్లాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా కూడా అన్స్టాపబుల్ షో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా అన్స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉందని.. ఎందుకంటే బాలయ్యతో తాను ఏడు సినిమాలు చేశానని.. తమ జోడీది హిట్ కాంబినేషన్ అని రోజా చెప్పారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబుతో బాలయ్య […]
Tom Latham: బుధవారం నాడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే సందర్భంగా మంగళవారం నాడు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్కు ముందు ఈ సిరీస్.. అందులోనూ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగబోతోంది కాబట్టి తమకు ఈ సిరీస్ ముఖ్యమైనదిగా భావిస్తున్నామని టామ్ లాథమ్ తెలిపాడు. విలియమ్సన్, సౌథీ లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించిందని. ఇది కూడా మంచి […]