విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.
అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. పెండింగ్ డీఏ, ఏపీజీఎల్ఐ, ఐఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిచేయడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పరిష్కారం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో ఈ చర్చలపై ఉత్కంఠ నెలకొంది.
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవీంద్ర జడేజా, తన కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు, కోడలితో చాలా కాలంగా దూరంగా ఉంటున్నానని.. సరైన సంబంధాలు లేవని చెప్పారు. తన కోడలు రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి తమ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయని తెలిపారు. అంతేకాకుండా.. చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిపై రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా…
ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి - గూడూరు రహదారి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆనంపై ఇటీవల ఇంచార్జ్ నేదురుమల్లి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. నేదురుమల్లి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆనం వెల్లడించారు. రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు. యువతను ఉత్సాహ పరిచేందుకు గ్రామంలోని పలు…
వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు.…
బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్తో బీజేపీ అందర్నీ లొంగ తీసుకుంటోందని ఆరోపించారు. సీబీఐ, జ్యూడిషియల్ ని గుప్పట్లో పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారని తెలిపారు. అధికారం కోసం పక్కా మైండ్ గేమ్ తో ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ లను మోడీ, అమిత్ షా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు జైల్ కి వెళ్లాడనికి కారణం మోడీ, అమిత్ షాలేనని రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోని 90శాతం మందికి ఇది తెలుసు..…
జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే దళిత సింహగర్జన ఉద్దేశమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. మరోసారి జగన్ సీఎం అయితే దళితులకు రక్షణ ఉండదన్నారు. రాజమండ్రిలో దళిత సింహ గర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఈ సభ పెట్టలేదని వివరణ ఇచ్చారు. తనకు పదవులు కొత్తకాదని చెప్పారు. ఆత్మగౌరవం కోసం దళితుల సింహ గర్జన బహిరంగ సభ పెట్టానని.. జగన్ అహంకారానికి దళితుల ఆత్మగౌరానికి పోరాటం అంటూ పిలుపునిచ్చారు.
సీనియర్లు వరల్డ్ కప్ను చేజార్చారు. ఇప్పుడు జూనియర్లు అదే పని చేశారు. జూనియర్లు అయినా.. వరల్డ్ కప్ గెలిచి ప్రతికారం తీర్చుకుందామనుకుంటే.. వీళ్లు కూడా మేము కూడా మీ వెంటనే ఉంటామన్నంటూ కప్ గెలవలేకపోయారు. ఫైనల్ వరకు వచ్చి టైటిల్ ను మిస్సయ్యారు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. 254 పరుగుల లక్ష్యచేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా…