Yarlagadda Venkatarao: ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా.. గన్నవరం భవిష్యత్తు మారుస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు. యువతను ఉత్సాహ పరిచేందుకు గ్రామంలోని పలు వీధుల్లో మోటారు బైక్పై తిరుగుతూ అభివాదం చేశారు.
Assam Budget: రూ. 2.9 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అస్సాం సర్కారు..
Also Read
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి పట్టం కడుదామని ఈవీఎంల్లో బటన్ నొక్కుదామని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు గన్నవరంలో టీడీపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తాను గెలుస్తే.. గన్నవరం అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని తెలిపారు.
Bihar: బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ విజయం
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎంతమాత్రం ప్రభావం చూపవని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ అధికారంలో ఉంటే సామాన్య ప్రజలు జీవనం సాగించే పరిస్థితి లేకపోవడ మేనన్న సత్యాన్ని ప్రజలు గ్రహించడమేనని చెప్పారు. అధికారంలోకి రాకముందు జగన్మోహనరెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవాడని అధికారం చేతికి వచ్చాక ఆయన ప్రజలకు చాలా దూరంగా ఉంటున్నారన్న విషయం అందరూ చూస్తునే ఉన్నారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చేది చంద్రబాబే అని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!