రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు.
నోయిడాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 94లో ఉన్న పోస్ట్మార్టం హౌస్లో అశ్లీల వీడియో బయటపడింది. ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేగాక.. ఆ నీచ పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్ని ఉద్యోగం నుంచి తొలగించారు.
వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వచ్చే ఏడాది జూన్, ఆగస్టు మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్నగర్కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లో చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబంసిరి జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. నిందితులను అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుపై ప్రభావం చూపి ఆటగాళ్లను ఎలా తయారో చేశారో చెప్పాడు. ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో బుమ్రా కూడా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు.
భారతీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అర్హత ఉన్న సబ్స్క్రైబర్లు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, మీరు అపరిమిత డేటాను అందిస్తున్న వినియోగదారులలో లేకుంటే.. గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. రీఛార్జ్పై గరిష్ట రోజువారీ డేటాను జియో అందిస్తుంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం, ముఖంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు పడటం, చర్మం వదులుగా ఉండటం.. ముఖం మెరుపు కోల్పోవడం వృద్ధాప్యానికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందు కోసం కెమికల్ అధికంగా ఉండే క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటిల్లో ఉండే రసాయనాలు, నిషేధిత పదార్థాల వల్ల దీర్ఘకాలంలో శరీరంలో అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు.