Crime News: రాఖీ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని గన్తో కాల్చి చంపిన దుండగులు..
- రాఖీ పండగ పూట తీవ్ర విషాదం
- తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన యువకుడి హత్య
- ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లో ఘటన
- బైక్పై వచ్చి ఇంట్లోకి చొరబడి యువకుడి హత్య
- మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లో చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
UP News: భార్య ముక్కు కోసేసిన భర్త.. కారణం ఏంటంటే..?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అరుణ్ తల్లిదండ్రులు రాఖీ, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లారు. ఈ సమయంలో అరుణ్ తన ఇంట్లో సోదరి, సోదరుడితో కలిసి ఓ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు యువకులు బైక్పై వచ్చారు. ఓ యువకుడు ఇంటి బయట ఉండగా.. మరోవ్యక్తి అరుణ్ ఇంట్లోకి వెళ్ళాడు. అరుణ్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడుతుండగానే ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి కాల్చాడు. దీంతో.. ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఈ క్రమంలో.. అరుణ్ రక్తస్రావంతో కింద పడిపోయాడు.
ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి.. ఆ సమస్యలకు చెక్..!
ఘటనను చూసిన అతని సోదరి, సోదరుడు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. వెంటనే బైక్పై తన స్నేహితుడితో కలిసి పరారయ్యాడు. కాగా.. అరుణ్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. అరుణ్ తండ్రి ఆర్ఎంపీ వైద్యుడు, అరుణ్ రోహ్తక్లోని ఓ కాలేజీలో ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు. రక్షా బంధన్ పండుగను జరుపుకునేందుకు ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!