Crime News: రాఖీ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని గన్తో కాల్చి చంపిన దుండగులు..
- రాఖీ పండగ పూట తీవ్ర విషాదం
- తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన యువకుడి హత్య
- ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లో ఘటన
- బైక్పై వచ్చి ఇంట్లోకి చొరబడి యువకుడి హత్య
- మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్.
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లో చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
UP News: భార్య ముక్కు కోసేసిన భర్త.. కారణం ఏంటంటే..?
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్లోని ఆదర్శ్నగర్లోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అరుణ్ తల్లిదండ్రులు రాఖీ, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్లారు. ఈ సమయంలో అరుణ్ తన ఇంట్లో సోదరి, సోదరుడితో కలిసి ఓ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు యువకులు బైక్పై వచ్చారు. ఓ యువకుడు ఇంటి బయట ఉండగా.. మరోవ్యక్తి అరుణ్ ఇంట్లోకి వెళ్ళాడు. అరుణ్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడుతుండగానే ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి కాల్చాడు. దీంతో.. ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఈ క్రమంలో.. అరుణ్ రక్తస్రావంతో కింద పడిపోయాడు.
ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి.. ఆ సమస్యలకు చెక్..!
ఘటనను చూసిన అతని సోదరి, సోదరుడు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. వెంటనే బైక్పై తన స్నేహితుడితో కలిసి పరారయ్యాడు. కాగా.. అరుణ్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. అరుణ్ తండ్రి ఆర్ఎంపీ వైద్యుడు, అరుణ్ రోహ్తక్లోని ఓ కాలేజీలో ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు. రక్షా బంధన్ పండుగను జరుపుకునేందుకు ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!