PM Modi: పోలాండ్ నుంచి ఇజ్రాయెల్, రష్యాకు ప్రధాని కీలక సలహా..
- పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- ఉక్రెయిన్.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై తీవ్ర ఆందోళన
- ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా..
- సంభాషణలు.. దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చు- మోడీ
- యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోంది- మోడీ.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు. మరోవైపు.. భారత్ తన స్నేహపూర్వక దేశాలతో చర్చలకు అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. తాము చర్చలు, దౌత్యానికి మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై పోరు కూడా అవసరమని భావిస్తున్నాం.. ఇది ప్రపంచ సవాలు, దీని కోసం అందరూ కలిసి రావాలని మోడీ సూచించారు.
Noida: అరె బాబు ఏంట్రా ఇది.. పోస్టుమార్టం గదిలో అదేం పనిరా..!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
పోలాండ్ తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్లో కూడా పర్యటించడం గమనార్హం. ఉక్రెయిన్ పర్యటనకు ముందు ప్రధాని మోడీ బుధవారం మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతంలో శాంతికి భారతదేశం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇది యుద్ధ యుగం కాదని.. ఏదైనా వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. పోలాండ్ రాజధానిలో భారతీయ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా భారతదేశం యొక్క విధానం అన్ని దేశాల నుండి దూరం పాటించడం. అయితే అన్ని దేశాలకు దగ్గరగా ఉండాలనేది నేటి భారత విధానం” అని పేర్కొన్నారు. నేటి భారతదేశం అందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటోందని మోడీ అన్నారు. నేటి భారతదేశం అందరి అభివృద్ధి గురించి మాట్లాడుతుంది.. నేటి భారతదేశం అందరితో ఉందని, ప్రతి ఒక్కరి ప్రయోజనాల గురించి ఆలోచిస్తుందని, ఏ దేశమైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటే ముందుగా ఆదుకునేది భారత్ అని మోడీ చెప్పారు. “ప్రపంచంలో ఎక్కడైనా భూకంపం లేదా ఏదైనా విపత్తు సంభవించినట్లయితే, భారతదేశానికి ఒకే ఒక మంత్రం – ముందు మానవత్వం” అని ఆయన అన్నారు.
KTR : రుణమాఫీలో కటింగ్ పెడితే.. రైతుభరోసాలో కూడా కటింగ్లు పెడుతాడు
కాగా.. ప్రధాని మోడీ రేపు (ఆగస్ట్ 23న) ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీనే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వివాదానికి శాంతియుత పరిష్కారంపై తన అభిప్రాయాలను ఉక్రెయిన్ అధినేతతో పంచుకుంటానని మోడీ చెప్పారు. మోడీ మాస్కో పర్యటనకు దాదాపు ఆరు వారాల తర్వాత కీవ్లో పర్యటించనున్నారు. అయితే.. మోడీ మాస్కో పర్యటనను అమెరికా, కొన్ని పాశ్చాత్య మిత్రదేశాలు విమర్శించాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!