Jakki Mahesh
Author- NTV Telugu-
Trying To Rob ATM: ప్రియురాలిని ఆకట్టుకునేందుకు ఏటీఎం చోరీకి యత్నం.. చివరికి ఏమైందంటే?
తన ప్రియురాలిని ఆకట్టుకోవాలని ఓ వ్యక్తి దొంగగా మారాడు. పశ్చిమ ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Iraq Protest: ఇరాక్ పార్లమెంట్లోకి దూసుకొచ్చి.. ప్రధాని అభ్యర్థిత్వంపై నిరసనకారుల ఆగ్రహం
వందలాది మంది ఇరాకీ మత గురువు ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులు శనివారం బాగ్దాద్లోని భారీ పటిష్టమైన పార్లమెంట్ భవనంపై దాడి చేసి ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని నిరసించారు. ఇరాన్ అనుకూల పార్టీలు తమ దేశ ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ.. ఇరాక్లో వందలాది మంది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. -
Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమక్షంలో శనివారం భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో 30,000 కిలోల డ్రగ్స్ని కాల్చివేశారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో పట్టుబడిన డ్రగ్స్ను చండీగఢ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాల్చివేసింది. -
Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ముంబయి ఆర్థిక స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే మహారాష్ట్రలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. -
V Srinivasa Rao: నేరస్థులే జడ్జి స్థానంలో ఉన్నట్లుగా బీజేపీ వైఖరి ఉంది..
ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని.. కేంద్రం తీరు అన్యాయంగా ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు అన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కనీసం వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. -
Tammineni Veerabhadram: సీపీఎం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదు..
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Central Minister Kishan Reddy: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండటం గర్వకారణం
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రామగుండంలో ఉన్న జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన ఇటువంటి అతి పెద్ద ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండటం అందరికీ చాలా గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. -
PM Narendra Modi: నీటిలో తేలియాడే సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
మగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 600 ఎకరాల్లో 423 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ను ప్రధాని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల కేంద్రంలో వర్చువల్గా ప్రారంభించారు. -
Punjab Minister: దూకుడుగా ప్రవర్తించిన మంత్రి.. అవమానంగా భావించి వైస్ ఛాన్సలర్ రాజీనామా
పంజాబ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఫరిద్కోట్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో అపరిశుభ్రతపై ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రాకు ఫిర్యాదులు అందాయి. దానిపై మీడియాతో కలిసి ఆయన గురు గోవింద్సింగ్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిని సందర్శించారు.
తాజావార్తలు
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!