Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Central Minister Kishan Reddy On Ntpc Largest Floating Solar Power Project Inauguration

Central Minister Kishan Reddy: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండటం గర్వకారణం

Published Date :July 30, 2022 , 4:39 pm
By Mahesh Jakki
Central Minister Kishan Reddy: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండటం గర్వకారణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Central Minister Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రామగుండంలో ఉన్న జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన ఇటువంటి అతి పెద్ద ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండటం అందరికీ చాలా గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. “40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో వాడిన మొత్తం 4.5 లక్షల సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్యానెల్‌లను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం క్రింద దేశంలోనే తయారు చేయడం జరిగింది. పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వల్ల సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుందని అంచనా. 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధించవచ్చు. ఈ ప్రాజెక్టు వలన పెద్దమొత్తంలో ఆవిరి రూపంలో వెళ్లే నీటి వృథా అడ్డుకోవచ్చు. 31 వేల ఇళ్లకు అవసరమైన విద్యుత్‌ను ఈ ప్రాజెక్టు ద్వారా అందించవచ్చు. ఇంకా మనం గమనిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటివరకు గత 8 సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. 2014లో, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,48,554 మెగావాట్ల నుంచి నేడు 4,00,000 మెగావాట్లకు చేరింది. ఇది మన డిమాండ్ కంటే 1,85,000 మెగావాట్లు ఎక్కువ.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

“భారత్ ఇప్పుడు తన పొరుగు దేశాలకు విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. 1,63,000 కి.మీ ట్రాన్స్‌మిషన్ లైన్‌లు కొత్తగా వేశారు. మొత్తం దేశాన్ని లడఖ్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి మయన్మార్ సరిహద్దు వరకుఒకే గ్రిడ్ గా ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రిడ్, ఈ గ్రిడ్‌ని ఉపయోగించి మనం దేశంలోని మూలమూలకు 1,12,000 మెగావాట్ల విద్యుత్‌ను ప్రసారం చేయవచ్చు. 2030 నాటికి మన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 40% పునరుత్పాదక ఇంధన వనరుల నుండి సమకూర్చు కోవాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మనం ఈ లక్ష్యాన్ని నవంబర్ 2021 నాటికి, షెడ్యూల్ కంటే 9 సంవత్సరాల ముందుగానే సాధించాము. ఈ రోజు మనం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 1,63,000 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము. మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

PM Narendra Modi: నీటిలో తేలియాడే సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

రూ.2,01,722 కోట్ల వ్యయంతో కేంద్రం గత ఐదేళ్లలో పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. 2,921 కొత్త సబ్ స్టేషన్లు, 3,926 సబ్ స్టేషన్ల విస్తరణ , 6,04,465 km LT లైన్లను ఏర్పాటు చేయడం, 2,68,838 పైగా కేవీ విద్యుత్ లైన్లు, 1,22,123 కిమీ వ్యవసాయ ఫీడర్ల స్థాపన చేయడం జరిగిందన్నారు. 2015లో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరి గంటలు 12.5 గంటలు ఉండగా.. ఇప్పుడు సగటున 22.5 గంటలకు పెరిగిందన్నారు. దేశంలోని కొన్ని అతి దూర ప్రాంతాలలోని గ్రామాల 2.86 కోట్ల ఇండ్లకు వ్యక్తిగత విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. 2018లో 987 రోజులలో విద్యుత్ అందుబాటులో లేని 18,374 గ్రామాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షణలో 100 శాతం గ్రామ విద్యుదీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు. సోలార్ పంపుల దత్తత కోసం ప్రవేశపెట్టిన పథకంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఇస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. అదనంగా, 30శాతం రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central minister kishan reddy
  • largest floating solar power project
  • ntpc floating solar power project
  • ntpc solar power project
  • PM Narendra Modi

తాజావార్తలు

  • Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

  • RCB Legend: “నువ్వు దేవుడు సామీ”.. 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్లుగా ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్..

  • Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇక పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి!

  • PK Vs RS : పవన్ కళ్యాణ్ Vs రణవీర్ సింగ్.. బాక్సాఫీస్ వద్ద ‘హ్యాట్రిక్’ క్లాష్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions