V Srinivasa Rao: నేరస్థులే జడ్జి స్థానంలో ఉన్నట్లుగా బీజేపీ వైఖరి ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Srinivasa Rao: ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని.. కేంద్రం తీరు అన్యాయంగా ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు అన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కనీసం వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. మరోవైపు నేరస్థులే జడ్జి స్థానంలో ఉన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందన్నారు. బీజేపీ నేతలు రాజధానికి నిధులు ఇవ్వకుండా తాము అధికారంలోకి వస్తే రాజధాని కడతామంటున్నారని.. రాజధాని అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సోము వీర్రాజుని రైతులు నిలదీస్తే పారిపోయారన్నారు.
Tammineni Veerabhadram: సీపీఎం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదు..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
కేంద్రంలోని బీజేపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. జగన్ డబ్బు ఎక్కడ ఉందో సత్యకుమార్ ప్రజలకు చూపించాలన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా ప్రజలపై భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంపై ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. వైద్య రంగంలో ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. దేశంలో పరిస్థితులపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి వైసీపీ పోరాటం చేయాలని సూచించారు. వైసీపీ ప్రజా అనుకూల విధానాలను అవలంభించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం గ్రామాలు తెలంగాణలో కలపాలనడంలో రాజకీయ పార్టీల నిర్ణయం ఉండదని.. ప్రజాభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏపీలో బీజేపీకి వత్తాసు పలుకుతున్న రెండు పార్టీలకు తగిన శాస్తి జరుగుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!