Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Burnt: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమక్షంలో శనివారం భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో 30,000 కిలోల డ్రగ్స్ని కాల్చివేశారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో పట్టుబడిన డ్రగ్స్ను చండీగఢ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాల్చివేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సుమారు 75,000 కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ రోజు వరకు తాము ఇప్పటికే 82,000 కిలోల మాదక ద్రవ్యాలను కాల్చివేసామని.. ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల మార్కుకు చేరుకుంటామని ఆయన వెల్లడించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జూన్ 1 నుండి డ్రగ్స్ నిర్మూలన ప్రచారాన్ని ప్రారంభించింది. జులై 29 వరకు 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల మాదకద్రవ్యాలను నిర్మూలించిందని ఒక అధికారి తెలిపారు.
Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!
Also Read
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?
30,468 కిలోలకు పైగా డ్రగ్స్ను కాల్చివేసిన తర్వాత, ఈ మొత్తం పరిమాణం 81,686 కిలోలకు చేరుకుంది. ఇది మాదకద్రవ్యాల రహిత భారతదేశం కోసం పోరాటంలో పెద్ద విజయంగా ఎన్సీబీ తన లక్ష్యాన్ని అధిగమించిందని అధికారి తెలిపారు. శనివారం ఢిల్లీలో 19,320 కిలోలు, చెన్నైలో 1,309 కిలోలు, గౌహతిలో 6,761 కిలోలు, కోల్కతాలో 3,077 కిలోల డ్రగ్స్ ధ్వంసమయ్యాయి. చండీగఢ్లో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల పట్ల కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించి దాని ఫలితాలను చూపుతోందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని సాధించేందుకు ఇది అవసరమని ఆయన అన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే “మురికి డబ్బు” దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది కాబట్టి భద్రతా దృక్కోణం నుండి కూడా ఇది ముఖ్యమైనదని అమిత్ షా అన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించిందని షా అన్నారు. ఈ సదస్సును ఎన్సీబీ నిర్వహించింది.
#WATCH | This is historic & has never happened in country where disposal of seized illicit narcotic substances is taking place across country (at 4 locations) on direction of HM Shah. Drugs worth 100 crore have been burnt today: ADGP Harmeet Singh, Guwahati Police Commissioner pic.twitter.com/55cmT11SWQ
— ANI (@ANI) July 30, 2022
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!