Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Burnt: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమక్షంలో శనివారం భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో 30,000 కిలోల డ్రగ్స్ని కాల్చివేశారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో పట్టుబడిన డ్రగ్స్ను చండీగఢ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాల్చివేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సుమారు 75,000 కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ రోజు వరకు తాము ఇప్పటికే 82,000 కిలోల మాదక ద్రవ్యాలను కాల్చివేసామని.. ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల మార్కుకు చేరుకుంటామని ఆయన వెల్లడించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జూన్ 1 నుండి డ్రగ్స్ నిర్మూలన ప్రచారాన్ని ప్రారంభించింది. జులై 29 వరకు 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల మాదకద్రవ్యాలను నిర్మూలించిందని ఒక అధికారి తెలిపారు.
Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
30,468 కిలోలకు పైగా డ్రగ్స్ను కాల్చివేసిన తర్వాత, ఈ మొత్తం పరిమాణం 81,686 కిలోలకు చేరుకుంది. ఇది మాదకద్రవ్యాల రహిత భారతదేశం కోసం పోరాటంలో పెద్ద విజయంగా ఎన్సీబీ తన లక్ష్యాన్ని అధిగమించిందని అధికారి తెలిపారు. శనివారం ఢిల్లీలో 19,320 కిలోలు, చెన్నైలో 1,309 కిలోలు, గౌహతిలో 6,761 కిలోలు, కోల్కతాలో 3,077 కిలోల డ్రగ్స్ ధ్వంసమయ్యాయి. చండీగఢ్లో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల పట్ల కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించి దాని ఫలితాలను చూపుతోందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని సాధించేందుకు ఇది అవసరమని ఆయన అన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే “మురికి డబ్బు” దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది కాబట్టి భద్రతా దృక్కోణం నుండి కూడా ఇది ముఖ్యమైనదని అమిత్ షా అన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించిందని షా అన్నారు. ఈ సదస్సును ఎన్సీబీ నిర్వహించింది.
#WATCH | This is historic & has never happened in country where disposal of seized illicit narcotic substances is taking place across country (at 4 locations) on direction of HM Shah. Drugs worth 100 crore have been burnt today: ADGP Harmeet Singh, Guwahati Police Commissioner pic.twitter.com/55cmT11SWQ
— ANI (@ANI) July 30, 2022
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..