Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: ముంబయి ఆర్థిక స్థితి గురించి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేతో పాటు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై వెంటనే గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని కూడా కోరాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు.
గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముంబైవాసులను తాము ఎప్పుడూ మరిచిపోమన్నారు. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరమని వెల్లడించిన సీఎం.. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారని పేర్కొన్నారు. అలాంటి మరాఠీ ప్రజలను అవమానించకూడదన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!
శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ముంబైలోని అంధేరీలో ఓ చౌక్కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ఆయన మాట్లాడుతూ.. ‘గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది’ అని వ్యాఖ్యానించారు. వీటిని మహారాష్ట్ర నేతలు ఖండించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గవర్నర్ వివరణ ఇచ్చారు. మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఆయన్ను ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ మండిపడ్డారు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..