Jakki Mahesh
Author- NTV Telugu-
Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?
తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
Harish Rao: త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్
త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలోని 9 జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. -
Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదు.. 5కు చేరిన సంఖ్య
దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసుతో ఢిల్లీలో కేసుల సంఖ్య 5కు చేరింది. -
Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం..
మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఐ పార్టీతో చర్చించి అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటిస్తామన్నారు. -
Vanama Venkateshwara rao: ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని వారు పగటికలలు కంటున్నారు..
తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. తనపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు పగటికలలు కంటున్నారని అలానే ప్రచారం చేసుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. వారి పగటి కలలు నెరవేరవని వెల్లడించారు. -
Devendra Fadnavis: త్వరలో మహారాష్ట్ర మంత్రులకు పోర్ట్ఫోలియోలు
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. -
Delhi: దేశ రాజధానిలో ఘోరం.. గోడపై మూత్ర విసర్జన చేసినందుకు పొడిచి చంపేశారు..
దేశ రాజధానిలో ఘోరం జరిగింది. గోడ మీద ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడని ఓ బృందం అతడిని పొడిచి చంపేసింది. రద్దీగా ఉన్న మార్కెట్లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఆ వ్యక్తి హత్యకు దారి తీసింది. -
Jammu Kashmir: ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం, ముగ్గురు జవాన్లు వీరమరణం
జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్లోని ఆర్మీ క్యాంప్పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు. -
Vivo V25 Pro: భారత్లో ఈ నెల 17న లాంచ్ కానున్న వివో వీ25 ప్రో.. అదిరే ఫీచర్లతో..
భారతదేశంలో వివో V25 ప్రో లాంచ్ ఆగస్ట్ 17న లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. స్మార్ట్ఫోన్ రంగు మారుతున్న బ్యాక్ ప్యానెల్తో రానుంది. ఇది వివో వీ25 సిరీస్లో భాగంగా వస్తోంది. ఈ సిరీస్లో ''వివో వీ25ఈ'' కూడా ఉంటుందని తెలుస్తోంది. -
Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!