Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy: తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డబ్బుల కోసం పార్టీ మారాలని అనుకుంటే 12 మందితోనే వెళ్లేవాడినని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలో అవమానాలు జరుగుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లో ఉన్నానని.. కానీ అది జరగలేదు అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలి, అవినీతి ప్రభుత్వం పోవాలని పోరాటం చేశానని చెప్పారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడిందని.. అందుకే బీజేపీ వైపు నిర్ణయం తీసుకున్నానన్నారు. అమిత్ షాను కలవగానే గట్టుప్పల్ మండల ఏర్పాటు నిర్ణయం వచ్చిందన్నారు. తన రాజీనామా తన కోసం కాదన్న ఆయన.. అభివృద్ధి కోసమేనన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు నేతల కుట్రలో భాగంగా పోస్టర్లు వెలిశాయన్నారు. టీఆర్ఎస్ ఎన్నిసార్లు ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. స్వార్థంతో రాజీనామా చేస్తే ప్రజలు స్వాగతిస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలను రుజువు చేయమని తాను సవాల్ విసిరినట్లు తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. కానీ తన సవాల్ను స్వీకరించలేదన్నారు. తాను తప్పు చేయలేదని.. 10వేల మందితో గర్భ గుడిలో ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతకుంటారని ఆయన తెలిపారు. మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం..
తనపై ఆరోపణలు చేసే వాళ్లు ఆధారాలతో వస్తే తాను నివృత్తి చేస్తామన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం అమిత్ షా ఆధ్వర్యంలో ధర్మయుద్ధం శంఖారావాన్ని పూరించడానికి వస్తున్నారన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తనకు తెలియదన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..