Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy: తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డబ్బుల కోసం పార్టీ మారాలని అనుకుంటే 12 మందితోనే వెళ్లేవాడినని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలో అవమానాలు జరుగుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లో ఉన్నానని.. కానీ అది జరగలేదు అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలి, అవినీతి ప్రభుత్వం పోవాలని పోరాటం చేశానని చెప్పారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడిందని.. అందుకే బీజేపీ వైపు నిర్ణయం తీసుకున్నానన్నారు. అమిత్ షాను కలవగానే గట్టుప్పల్ మండల ఏర్పాటు నిర్ణయం వచ్చిందన్నారు. తన రాజీనామా తన కోసం కాదన్న ఆయన.. అభివృద్ధి కోసమేనన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు నేతల కుట్రలో భాగంగా పోస్టర్లు వెలిశాయన్నారు. టీఆర్ఎస్ ఎన్నిసార్లు ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. స్వార్థంతో రాజీనామా చేస్తే ప్రజలు స్వాగతిస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలను రుజువు చేయమని తాను సవాల్ విసిరినట్లు తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. కానీ తన సవాల్ను స్వీకరించలేదన్నారు. తాను తప్పు చేయలేదని.. 10వేల మందితో గర్భ గుడిలో ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతకుంటారని ఆయన తెలిపారు. మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Also Read
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం..
తనపై ఆరోపణలు చేసే వాళ్లు ఆధారాలతో వస్తే తాను నివృత్తి చేస్తామన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం అమిత్ షా ఆధ్వర్యంలో ధర్మయుద్ధం శంఖారావాన్ని పూరించడానికి వస్తున్నారన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తనకు తెలియదన్నారు.
తాజావార్తలు
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:45కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్