Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy: తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డబ్బుల కోసం పార్టీ మారాలని అనుకుంటే 12 మందితోనే వెళ్లేవాడినని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలో అవమానాలు జరుగుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లో ఉన్నానని.. కానీ అది జరగలేదు అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలి, అవినీతి ప్రభుత్వం పోవాలని పోరాటం చేశానని చెప్పారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడిందని.. అందుకే బీజేపీ వైపు నిర్ణయం తీసుకున్నానన్నారు. అమిత్ షాను కలవగానే గట్టుప్పల్ మండల ఏర్పాటు నిర్ణయం వచ్చిందన్నారు. తన రాజీనామా తన కోసం కాదన్న ఆయన.. అభివృద్ధి కోసమేనన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు నేతల కుట్రలో భాగంగా పోస్టర్లు వెలిశాయన్నారు. టీఆర్ఎస్ ఎన్నిసార్లు ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. స్వార్థంతో రాజీనామా చేస్తే ప్రజలు స్వాగతిస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలను రుజువు చేయమని తాను సవాల్ విసిరినట్లు తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. కానీ తన సవాల్ను స్వీకరించలేదన్నారు. తాను తప్పు చేయలేదని.. 10వేల మందితో గర్భ గుడిలో ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతకుంటారని ఆయన తెలిపారు. మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం..
తనపై ఆరోపణలు చేసే వాళ్లు ఆధారాలతో వస్తే తాను నివృత్తి చేస్తామన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం అమిత్ షా ఆధ్వర్యంలో ధర్మయుద్ధం శంఖారావాన్ని పూరించడానికి వస్తున్నారన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తనకు తెలియదన్నారు.
తాజావార్తలు
-
Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
-
Astrology: మాట నిలబెట్టుకునే 4 రాశులవారు వీరేనా? ఒకసారి కమిట్ అయితే వెనక్కి తగ్గరట!
-
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!