Gangavaram SI Bribe Case :కౌన్సిలింగ్ పేరుతో లంచం డిమాండ్.. ఎస్సై అరెస్ట్
- అనార్కలి అనే యువతితో దాసరి శివకుమార్ కు వివాహేతర సంబంధం
- మొదటి భార్య ఫిర్యాదుతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
- కేసు సర్దుబాటు చేయాలంటే రూ. 20వేలు లంచం డిమాండ్
- లంచం కోసం ఎస్సై వెంకటేష్ డిమాండ్
కంచె చేను మేస్తుందనే సామెత గుర్తుందా? పోలవరం జిల్లాలోని గంగవరం పోలీసులకు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా ఓ ఎస్సై, కానిస్టేబుల్ దొరికిపోవడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం డివిజన్లో గంగవరం పోలీస్ స్టేషన్లో పోలీసుల అవినీతి బాగోతం వెలుగు చూసింది..
ఓ వివాహేతర సంబంధం కేసులో గంగవరం స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్ లంచం డబ్బులు తీసుకుని అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు.. గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన అనార్కలి అనే యువతితో దాసరి శివకుమార్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతని మొదటి భార్య గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
ఫిర్యాదు ఆధారంగా ఎస్సై వెంకటేష్ ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో కేసు విషయాన్ని సర్దుబాటు చేయాలంటే 20 వేల రూపాయిలు లంచంగా ఇవ్వాలని ఎస్సై వెంకటేష్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే శివ కుమార్.. డబ్బు ఇచ్చుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్సై వెంకటేష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. లేని పక్షంలో కేసును కఠినంగా నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!
అంతేకాక.. నగదు తన చేతికి అందేంత వరకు శివకుమార్ సెల్ఫోన్ను తన వద్దనే ఉంచుకున్నట్లు బాధితుడు తెలిపారు. న్యాయం చేయాల్సిన ఎస్సై… డబ్బు డిమాండ్పై విసిగిపోయిన శివకుమార్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ట్రాప్ ఆపరేషన్కు రంగం సిద్ధం చేసింది…
ఏసీబీ అధికారులు ముందుగా సాక్షుల సమక్షంలో నగదు నోట్లపై రసాయన పౌడర్ పూసి బాధితుడికి అందించారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ముందుగా ప్లాన్ చేసిన విధంగా శివకుమార్ కానిస్టేబుల్ వీరబాబుకు 15,000 రూపాయాలు నగదు అందజేశాడు. నగదు స్వీకరించిన వెంటనే అక్కడే గస్తీ కాస్తున్న ఏసీబీ అధికారులు దాడి చేసి కానిస్టేబుల్ వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. రసాయన పరీక్షల్లో ఈయన చేతులకు పౌడర్ ఆనవాళ్లు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో, ఎస్సై వెంకటేష్ సూచన మేరకు తాను డబ్బు తీసుకున్నట్లు కానిస్టేబుల్ వీరబాబు వెల్లడించారు..
అనంతరం ఎస్సై వెంకటేష్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డబ్బు డిమాండ్ చేసిన ఆధారాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం వ్యవహారంలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం కేసును సర్దుబాటు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని ఒత్తిడి తేవడం వంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి…
Alexei Navalny: కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య.. రష్యాపై సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్రైజర్స్ ముందు భారీ లక్ష్యం
-
Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!