అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు.
2017లో జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యతో సంఘ్కు సంబంధం ఉందని ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో లిఖితపూర్వక స్టేట్మెంట్ను దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి థానే కోర్టు 500 రూపాయల జరిమాన విధించింది.
ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తాం.. అలాగే, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చాడు.
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులను భట్టి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా కనిపిస్తుంది. మొదట రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదం కొనసాగుతుంది.. ఇప్పుడు హౌతీ యెమెన్ యుద్ధం ఈ మూడు కారణాల వల్ల థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? అనే పరిస్థితులతో ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతుంది.
బలూచిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్- ఇరాన్ అంగీకరించాయి. తీవ్రవాద లక్ష్యాలపై ఇటీవలి ఘోరమైన వైమానిక దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి.
జనవరి 22న కేంద్ర కార్యాలయాలకు సగం రోజుల సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు కూడా హాప్ డే సెలవు ఇచ్చారు.
బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు ఈ నెల 21వ తేదీ లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి పొడిగింపు కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
జపాన్కు చెందిన మూన్ మిషన్ స్నిపర్ ఈరోజు చంద్రుడి ఉపరితలంపై దిగబోతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు చంద్రుడి ఉపరితలంపై స్నిపర్ ల్యాండ్ కానుందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తెలిపింది.