Pawan Kalyan: జగన్ ఇది 2009 కాదు.. 2024.. గుర్తు పెట్టుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy: ఇది 2009 కాదు.. 2024.. జగన్ గుర్తు పెట్టుకోవాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. రౌడీయిజానికి నేను భయపడను.. మనల్ని తన్ని తగలేస్తే.. మనం కూడా తన్ని తగలేయాలన్నారు.వేరే కులాలకు మంత్రి పదవి ఇస్తారు కానీ.. ప్రాక్సీ ఎమ్మెల్యేలుగా వాళ్ల గుంపే ఉంటుంది అని తెలిపారు. ఇక, పుష్ప ( Pushpa ) సినిమా చూడడానికి బాగుంటుంది.. కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్లని నిజ జీవితంలో భుజానికి ఎత్తుకోగలమా..? అని ప్రశ్నించారు. తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.. టిక్కెట్లు అమ్మేస్తున్నారు.. శ్రీవాణి ట్రస్టుని దోచేస్తున్నారు.. గతంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు వంటి వారు చెబితే నేనూ మాట్లాడాను అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, అలాంటి రమణ దీక్షితులు కూడా టీటీడీ ( TTD )లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడ్డం లేదు.. రాయలసీమతో నాకిదే సమస్య.. తొడగొట్టడాలు నాకు తెలీదు.. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..? అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Suhas: నా బతుకేంటో నాకు అర్థం కావడం లేదు.. నీ ఫ్యూచర్ ఎవడికి కావాలి?
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
ఇక, ఆరణి శ్రీనివాస్ ( Arani Srinivas ) నాకు 2008 నుంచి పరిచయస్తుడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొద్దిపాటి ఓట్ల తేడాతో 2009లో ఆరణి ఓడించబడ్డాడు.. ఏం ఆశించకుండా పార్టీలో పని చేయడానికి ఆరణి సిద్దపడ్డారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంది.. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి మీద నాకేం శతృత్వం లేదు.. రాయలసీమ కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనే బాధ నాకుంది.. రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది అని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతు ఇస్తున్నారు.. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భయపడుతున్నారు.. ఈ నేల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ది కాదు అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చెప్పారు.
Read Also: EPFO: ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
రాయల వారు ఏలిన నేల రాయలసీమ.. ఊర కుక్కలను కుందేలు తరిమిన నేల రాయలసీమ అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వెల్లడించారు. అలాంటి ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది.. ఇక, 2019లో నేను ఓడిన సమయంలో ప్రీతి తల్లి వచ్చి నన్ను కలిసింది.. తన లాంటి వారి కోసం నన్ను నిలబడాలని కోరింది.. నన్ను కర్నూలు రావాలని ఆహ్వానించింది.. నేను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు.. జనసేన ( Janasena ) ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చారు అని జనసేనాని తెలిపారు.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..