Pawan Kalyan: జగన్ ఇది 2009 కాదు.. 2024.. గుర్తు పెట్టుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy: ఇది 2009 కాదు.. 2024.. జగన్ గుర్తు పెట్టుకోవాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. రౌడీయిజానికి నేను భయపడను.. మనల్ని తన్ని తగలేస్తే.. మనం కూడా తన్ని తగలేయాలన్నారు.వేరే కులాలకు మంత్రి పదవి ఇస్తారు కానీ.. ప్రాక్సీ ఎమ్మెల్యేలుగా వాళ్ల గుంపే ఉంటుంది అని తెలిపారు. ఇక, పుష్ప ( Pushpa ) సినిమా చూడడానికి బాగుంటుంది.. కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్లని నిజ జీవితంలో భుజానికి ఎత్తుకోగలమా..? అని ప్రశ్నించారు. తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.. టిక్కెట్లు అమ్మేస్తున్నారు.. శ్రీవాణి ట్రస్టుని దోచేస్తున్నారు.. గతంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు వంటి వారు చెబితే నేనూ మాట్లాడాను అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, అలాంటి రమణ దీక్షితులు కూడా టీటీడీ ( TTD )లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడ్డం లేదు.. రాయలసీమతో నాకిదే సమస్య.. తొడగొట్టడాలు నాకు తెలీదు.. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..? అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Suhas: నా బతుకేంటో నాకు అర్థం కావడం లేదు.. నీ ఫ్యూచర్ ఎవడికి కావాలి?
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
ఇక, ఆరణి శ్రీనివాస్ ( Arani Srinivas ) నాకు 2008 నుంచి పరిచయస్తుడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొద్దిపాటి ఓట్ల తేడాతో 2009లో ఆరణి ఓడించబడ్డాడు.. ఏం ఆశించకుండా పార్టీలో పని చేయడానికి ఆరణి సిద్దపడ్డారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంది.. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి మీద నాకేం శతృత్వం లేదు.. రాయలసీమ కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనే బాధ నాకుంది.. రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది అని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతు ఇస్తున్నారు.. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భయపడుతున్నారు.. ఈ నేల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ది కాదు అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చెప్పారు.
Read Also: EPFO: ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
రాయల వారు ఏలిన నేల రాయలసీమ.. ఊర కుక్కలను కుందేలు తరిమిన నేల రాయలసీమ అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వెల్లడించారు. అలాంటి ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది.. ఇక, 2019లో నేను ఓడిన సమయంలో ప్రీతి తల్లి వచ్చి నన్ను కలిసింది.. తన లాంటి వారి కోసం నన్ను నిలబడాలని కోరింది.. నన్ను కర్నూలు రావాలని ఆహ్వానించింది.. నేను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు.. జనసేన ( Janasena ) ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చారు అని జనసేనాని తెలిపారు.
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!