Minister Roja: రెండు బటన్లు నొక్కి వైసీపీని గెలిపించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలోని పూత్తురు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో కొత్తగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు తమ కోసం రెండు బటన్లు నొక్కాలన్నారు. తొలి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైసీపీకి అండగా నిలవాలని మంత్రి రోజా కోరింది. ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు. మీ సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూసే రోజులు పోయి.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్ తెచ్చి ఇస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.
Read Also: Priyanka Gandhi: లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ప్రియాంకా గాంధీ.?
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఇక, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల స్థాయికే వెళ్లే పని లేకుండా ఇంటి దగ్గరకే వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల రైతులకు నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించి వారికి సాయం అందుతోందని చెప్పారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సీఎం జగన్ గొప్ప గొప్ప వ్యవస్థలను నెలకొల్పాడు.. ఇలాంటి సౌకర్యవంతమైన పరిపాలన ఎవరైనా అందించారా అనేది ప్రజలు ఆలోచించాలని మంత్రి రోజా సూచించారు.
Read Also: Pakistan: కోర్టులో సరండర్ కానున్న నవాజ్ షరీఫ్ కుమారులు
అయితే, నాడు- నేడు కింద పాఠశాలలను మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకురావడంతో పిల్లల చదువులు చక్కబడ్డాయని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలు స్టేట్ ర్యాంకుల స్థాయికి ఎదిగారని ఆమె అన్నారు. విద్యలో జగనన్న తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా లబ్ధి అందించే సహాయ సహకారాలను ప్రజలు గమనించాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!