శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా, బేబీ డమరి సమర్పణలో నిర్మితమవుతున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంలో నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వయంగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తల్లి సెంటిమెంట్తో పాటు హారర్, యాక్షన్ అంశాలను మేళవించిన ఈ […]
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జరగనుంది. ఈ ఈవెంట్ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం పెద్ద వేదిక కోసం పోలీస్ అనుమతి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఈవెంట్కు ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం ఉండటంతో, అభిమానుల నుంచి భారీ జనసమీకరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్ సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు […]
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన నిర్మించనున్న చిత్రంలో ‘కోర్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమేష్ రూపకల్పన చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్గా ‘తెల్ల కాగితం’ అనే […]
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్గా పేరొందిన పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూరీ సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్పై ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందని కొన్ని […]
తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (స్రీనివాస కుమార్) తెలుగు హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, ‘బేబీ’ సినిమాతో బ్లాక్బస్టర్ విజయం సాధించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. వైష్ణవి చైతన్య నటించిన తాజా చిత్రం ‘జాక్’ లోని ఓ కిస్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా […]
బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడని కేసు నమోదైన క్రమంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, […]
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి చేరింది. ఈ యాప్స్ను ప్రచారం చేసిన యూట్యూబర్లు, వారికి జరిగిన చెల్లింపులు మరియు ఆర్థిక లావాదేవీలపై ఈడీ తీవ్రంగా విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ మరియు హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన వివరాలను ఈడీ తెప్పించుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేందుకు […]
గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఒక యూట్యూబర్తో కలిసి వీసీ సజ్జనర్ చేసిన ఒక ఇంటర్వ్యూ తర్వాత వరుసగా వారందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ సహా మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక నటి, హీరోయిన్ మంచు […]
వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సేతుపతి చేసే సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కథ చెప్పి ఒప్పించిన పూరీ జగన్నాథ్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఒక హిట్ తర్వాత రెండు […]
అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో "కోర్ట్" సినిమా టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై అందిన సమాచారం ఆధారంగా, రీజనల్ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కె. మాధవి, మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో) అశోక్ నేతృత్వంలో అధికారుల బృందం థియేటర్లో తనిఖీలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీల సందర్భంగా, "కోర్ట్" సినిమా టికెట్ ధర నిబంధనల ప్రకారం 110 రూపాయలుగా ఉండాల్సి ఉండగా, థియేటర్ యాజమాన్యం దానిని 150 రూపాయలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.